బండి సంజయ్ పై పవన్ పొగడ్తల వర్షం

Update: 2020-12-05 09:37 GMT
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు.  తెలంగాణ బిజెపిని.. దాన్ని నడిపించిన బండి సంజయ్ ను ఉద్దేశించి ‘టైగర్’ అని సంబోధించాడు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోరాట పటిమను ప్రశంసించాడు.

"జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన  బిజెపికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బిజెపి ఈ ఎన్నికలను జిహెచ్‌ఎంసి ఎన్నికలుగా చూడలేదు.  ప్రపంచ స్థాయి నగరంలో జరిగే ఎన్నికలుగానే చూశారు.  అందువల్ల వారి కేంద్ర నాయకత్వం దిగివచ్చి మరీ ఈ  నగరంలో ప్రచారం చేసింది, ”అని  నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ అన్నారు.

తన ప్రసంగంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ గురించి ప్రస్తావించిన పవన్ వారి కృషి వల్లే బీజేపీ గెలిచిందన్నారు. లక్ష్మణ్ తనకు పెద్ద సోదరుడిలాంటివాడని, కిషన్ రెడ్డి స్థిరమైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. "2008 నుండి  కిషన్ రెడ్డిని నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతను సమర్థవంతమైన నాయకుడు.  మా తండ్రిని కోల్పోయినప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి పరామర్శించాడు. తెలంగాణ బిజెపి   బండి సంజయ్ వంటి బలమైన నాయకుడిని అందుకుంది. బిజెపి నాయకులు, కార్మికులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఆయన ఎన్నికలలో పోరాడారు, ”అని పవన్ కళ్యాణ్ అన్నారు. జిహెచ్‌ఎంసి  ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ, తెలంగాణ జనసేన నాయకులకు ట్విట్టర్‌లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన బండి సంజయ్‌కు పవన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు  తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఫలితాలు అందరికీ బలమైన సంకేతాన్ని పంపాయని పవన్‌ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన లేదా బిజెపి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది  కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. “నేను తిరుపతిలో జెపి నడ్డాను కలిసినప్పుడు, తిరుపతి ఉప ఎన్నికతో సహా పలు సమస్యలపై చర్చించాము. తిరుపతిలో జనసేన కేడర్ మరియు నాయకుల అభిప్రాయాన్ని కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఆపై అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటాను ”అని పవన్ వివరించారు
Tags:    

Similar News