పవన్ ఫ్లెక్సీ ధ్వంసం.. భీమవరంలో దాడులు

Update: 2015-09-03 05:52 GMT
అభిమానంతో ఏర్పాటు చేసుకున్న తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనికి రెచ్చిపోయారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. బుధవారం పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అభిమానంతో పలు కార్యక్రమాల్ని నిర్వహించటం తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అభిమానులు కొందరు పవన్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అయితే.. బుధవారం రాత్రి.. ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారు. ఈ విసయాన్ని గుర్తించిన పవన్ ఫ్యాన్స్ చెలరేగిపోయారు. తమ కథానాయకుడి ఫ్లెక్సీల్ని ధ్వంసం చేసిన దానిపై ఆందోళన నిర్వహించిన వారు.. ఇతర హీరోల అభిమానుల ఇళ్లపై రాళ్లు వేశారు. కొన్నిచోట్ల దాడులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. భీమవరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి తీవ్రత గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆందోళనకారుల్ని నియంత్రించే పనిలో పడ్డారు. అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి.. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అయినా.. ఏ నిమిషాన ఏం జరుగుతుందోనన్న భయం భీమవరం వాసుల్లో నెలకొంది.
Tags:    

Similar News