రేప్ చేసి చంపేసి తినే మానవ మృగాలకు ఉరి

Update: 2017-07-24 13:52 GMT
పదకొండేళ్ల కిందట వెలుగు చూసిన సీరియల్ హత్యల నిందితులు, నరరూప రాక్షసులైన మోహింద‌ర్ సింగ్ పందేర్‌, సురీంద‌ర్ కోలీల‌కు ప్ర‌త్యేక సీబీఐ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.
    
ఢిల్లీ సమీపంలో జరిగిన వ‌రుస హత్య‌ల‌ కేసులో ఈ ఇద్ద‌రూ ప్ర‌ధాన‌ నిందితులు. పింకీ స‌ర్కార్ అనే యువతి హత్యతో వీరి నేరాలు మొత్తం బయటపడ్డాయి. ప్రస్తుతం పింకీ మ‌ర్డ‌ర్ కేసులోనే ఈ ఇద్ద‌రికీ మ‌ర‌ణ‌శిక్షను ఖ‌రారు చేశారు. వ్యాపార‌వేత్త మోహింద‌ర్‌ -  అత‌ని ప‌నిమనిషి కోలిలు అనేక మందిని కిడ్నాప్ చేసి హ‌త్య చేశారు.
    
నోయిడా స‌మీపంలో ఉన్న నితారిలో మోహింద‌ర్ ఇల్లు ఉంది. 2006లో అత‌ని ఇంట్లో సుమారు 19 మృత‌దేహాల‌ను వెలికితీశారు. మొత్తం 16 కేసుల్లో ఛార్జ్‌ షీట్ దాఖ‌లు చేశారు. సాక్ష్యాలు లేని కార‌ణంగా మ‌రో మూడు కేసుల‌ను మూసివేశారు.
    
నిందితులిద్ద‌రూ టీనేజీ అమ్మాయిల‌ను రేప్ చేసి హ‌త్య చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి... ఆ తరువాత రేప్ చేసి హత్య చేసేవారని.. అనంతరం వారి సున్నిత శరీరావయవాలను వండుకుని తినేవారన్న ఆరోపణలూ ఉన్నాయి.
Tags:    

Similar News