ఆ ఏడు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ నిషేధం

Update: 2020-12-29 12:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో కొత్త సంవత్సరం‌ వేడులకు పలు రాష్ట్రాలు బ్రేక్‌ వేశాయి. ఇప్పటికే వైరస్‌ మహమ్మారితో విలయం సృష్టిస్తుండగా బ్రిటన్‌ లో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌తో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల ప్రారంభంలో యూకె ‌లో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్‌ అనేక ఇతర యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. భారత్‌ సహా పలు దేశాల్లో విమానాలపై తాత్కాలిక నిషేధం విధించాయి. మహమ్మారి మరింత వ్యాప్తిని నియంత్రించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర వేడుకలకు ముందు మార్గదర్శకాలను ప్రకటించాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జనవరి 5వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించింది. ముంబై, పుణెతో పాటు పెద్ద నగరాల్లోనూ బహిరంగ నూతన వేడుకలకు అనుమతించడం లేదు. కర్ణాటకలోనూ గురువారం సాయంత్రం 6గంటల నుంచి 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడంతో పాటు క్లబ్ ‌లు, పబ్‌ లు, రెస్టారెంట్‌ లతో పెద్ద ఎత్తున సమావేశాలపై జనవరి 2వ తేదీ వరకు నిషేధం విధించారు. తమిళనాడులో క్లబ్‌, పబ్‌లు, బీచ్‌ రిసార్ట్స్‌, రెస్టారెండ్లు, బీచ్‌ లలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్ ‌ను ప్రభుత్వం నిషేధించింది.

హిమాచల్‌ ప్రదేశ్ లో  జనవరి 5వ తేదీ వరకు సిమ్లా, మండి, కంగ్రా, కులులో రాత్రి కర్ఫ్యూ విధించారు. ఆయా జిల్లాలో బహిరంగ నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్‌ లోనూ ప్రభుత్వం గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లోనూ నూతన సంవత్సర పార్టీలు, పటాకులు పేల్చడంపై నిషేధం విధించింది. ఉత్తరాఖండ్‌ లో హోటళ్లు, బార్‌, రెస్టారెంట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై డెహ్రాడూన్‌ పరిపాలన అనుమతి ఇవ్వలేదు.
Tags:    

Similar News