గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన కరోనా కేసులు

Update: 2020-09-26 17:30 GMT
రోజుకు 10వేల చొప్పు నమోదవుతున్న ఏపీలో తాజాగా కరోనా తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. డిశ్చార్జీలు పెరుగుతున్నాయి. గతంతో పోలీస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య 10శాతం తగ్గడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఈ జిల్లాలో ఒక్కరోజులోనే 1000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 7293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75990 టెస్టులు చేయగా దాదాపు 7వేలకు పైగా  కేసులు వెలుగుచూశాయి.  తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 57గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5663కు పెరిగింది.  

ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు  భారీగా నమోదయ్యాయి.   తూర్పు, పశ్చిమ గోదావరిలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకంగా  కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News