ఊహించ‌ని వ్య‌క్తి నుంచి బాబుకు కోటి విరాళం

Update: 2016-02-11 05:15 GMT
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని చూసిన ఒక వృద్దురాలు స్పందించింది. 80 ఏళ్ల వృద్ధురాలు ముప్పవరపు స్వరాజ్యం తన స్వార్జితమైన కోటి రూపాయిల మొత్తాన్ని అమరావతి కోసం విరాళంగా ఇవ్వటం గమనార్హం. గుంటూరు జిల్లా మంగళగిరి నీరుకొండ గ్రామానికి చెందిన ఆమె.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ.కోటి చెక్కును ఇవ్వటం గమనార్హం.

తన భర్త 40 ఏళ్ల క్రితం మరణించారని.. అప్పటి నుంచి తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని అమరావతికి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా తాను వ్యవసాయం చేస్తూనే సంపాదించినట్లుగా పేర్కొనటం గమనార్హం. ఏపీ కోసం చంద్రబాబు పడుతున్న కష్టం తనను కదిలించిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాసేవ కోసం అంకితమైనట్లు తరచూ మాటలు చెప్పేకోటీశ్వరులైన ఎమ్మెల్యేలు పార్టీలో ఎంతోమంది ఉన్నా.. వారెవరూ గుర్తించని బాబు కష్టాన్ని.. ఒక వృద్ధమహిళ గుర్తించి తన ఆస్తిలో కోటి రూపాయాల్ని విరాళంగా ఇవ్వటం గమనార్హం. ఒక వృద్దురాల్ని కదిలించిన చంద్రబాబు.. పార్టీ నేతల్ని ఎందుకు కదిలించలేకపోతున్నట్లో..?
Tags:    

Similar News