ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు లేనట్లే

Update: 2015-03-16 18:30 GMT
 ఏపీలో త్వరలో జరగాల్సిన ఎమ్మెల్సీ  ఎన్నికలు జరగవా? అంటే.. అవుననే చెప్పాలి. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నికయ్యే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు ఖాళీలకు.. మూడు అధికార తెలుగుదేశం పార్టీ.. మిగిలిన రెండు స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దించింది.

ఐదు స్థానాలకు.. ఐదుగురు అభ్యర్థులే రంగంలో ఉండటంతో.. వారి ఎన్నిక నామమాత్రం కానుంది. తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులుగా.. గుమ్మడి సంధ్యారాణి.. వీవీవీ చౌదరి.. తిప్పేస్వామిలకు అవకాశం ఇవ్వగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక కావటం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News