రోహిత్​ - రహానేలకు గట్టిగా చురకలు అంటించిన లక్ష్మణ్​..

Update: 2021-02-11 16:30 GMT
ఇంగ్లండ్​తో జరిగిన తొలిటెస్ట్​లో భారతజట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్​లో రోహిత్​, రహానే దారుణంగా ఫెయిల్​ అయ్యారు. దీంతో వాళ్ల ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు ఇన్సింగ్స్​లో రోహిత్​ వరసగా 6,12 పరుగుల వద్ద అవుట్​ అయ్యాడు. రహానే అయితే ఇంకా ఘోరంగా 1,0 తో నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియా టెస్ట్​ సీరిస్​ విజయం సాధించడంతో.. రహానేను మీడియా, సీనియర్​ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేశారు.

ఇప్పుడు వరసగా ఫెయిల్ అవుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.తాజాగా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ వీళ్ల ఆటతీరుపై మండిపడ్డారు.వీళ్లిద్దరి ఆట తనను ఎంతో నిరాశపరిచిందని పేర్కొన్నారు. వీళ్లు కనీసం ఫిబ్రవరి 13 నుంచి జరగబోయే రెండో టెస్ట్​లోనైనా రాణించాలి అని సూచించాడు. తొలి టెస్టులో రహానె‌లో ఏ మాత్రం జాగ్రత్త వహించలేదు.

 అండర్సన్ బంతి నుంచి రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడని తెలిసినా.. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా బంతిని ఎదుర్కొని రహానే బౌల్డయ్యాడు. స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌ను అంచనా వేయలేక రోహిత్ శర్మ ఆఫ్ స్టంప్‌ని వదిలేయడంతో క్లీన్‌బౌల్డయ్యాడు. తొలిటెస్ట్​లో భారత్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యింది.  రెండో టెస్టులో షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News