వంద హత్యలు చేసిన కిల్లర్ డాక్టర్ అరెస్ట్ !

Update: 2020-07-30 09:10 GMT
ఎవరైనా 100 మంచి పనులు చేయాలనీ అనుకుంటారు. కానీ , మనిషి కాపాడే డాక్టర్ వృత్తిలో ఉంటూ నరరూప రాక్షసుడిగా మారి 100 అమాయకుల ప్రాణాలు తీసాడు. 100మందిని అతికిరాతకంగా హత్య చేసి చంపి , పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న కిల్లర్ డాక్టర్ దేవేంద్ర శర్మ ను ఎట్టకేలకు  ఢిల్లీలోని బాప్‌ రైలాలో నార్కోటిక్స్  పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన డాక్టర్ శర్మ ట్రక్, టాక్సీ డ్రైవర్లని దాదాపు వందమందిని అతి దారుణంగా హత్య చేశాడు. హత్యల సంఖ్య వంద చేరుకోవడంతో ఆ తర్వాత హత్యలు చేయడం నిలిపివేశాడు.  దేశంలోని పలు రాష్ట్రాలలో న‌డిచిన కిడ్నీ రాకెట్ ‌తో డాక్ట‌ర్ శ‌ర్మ‌కు సంబంధాలున్నాయి. సుమారు 125 మందికి చెందిన‌ కిడ్నీలను అక్రమంగా తొలగించి, మార్పిడి చేసేవాడు.

ఇలా ఒక్కో కేసులో రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు సొమ్ముచేసుకునేవాడు. ఓ హత్య కేసులో పట్టుబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న డాక్టర్ శర్మ ఈ ఏడాది జనవరిలో 20 రోజుల పెరోల్ ‌పై బయటకు వచ్చి ఢిల్లీలోని బాప్ ‌రైలాకు పారిపోయి అక్కడే పోలీసులకి తెలియకుండా , గుట్టుచప్పుడు కాకుండా దాక్కొని ఉన్నాడు. అక్కడ ఓ వితంతువును పెళ్లాడి ఆమెతో ఉంటున్నాడు. అతడి కోసం గాలిస్తున్న జైపూర్ పోలీసులకు శర్మ గురించి ఈ విషయాలు తెలిశాయి.దీనితో వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా వారు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
 
బీఏఎంఎస్ మాత్రమే చదివిన దేవేంద్రశర్మ కిడ్నీలు తొలగించడంలో మహా అనుభవజ్ఞుడు. ట్రక్ డ్రైవర్లను చంపి వారి మృతదేహాలను కాస్గంజ్ సమీపంలోని హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసి ఆధారాలు మాయం చేసేవాడు. అనంతరం వాహనాలను కాస్గంజ్‌ లో అమ్మేవాడు. లేదంటే తుక్కుగా మార్చి మీరట్ ‌లో అమ్ముకునేవాడు. కాగా, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని తీసుకెళ్లేందుకు జైపూర్ పోలీసులు ఢిల్లీ బయలుదేరారు. శర్మపై పలు చీటింగ్, కిడ్నాప్ కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో 2004లో శర్మతో పాటు పలువురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News