11న ఏపీ కేబినెట్ భేటి.. కీలక అంశాలివే..

Update: 2020-06-03 11:50 GMT
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 11న ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరగబోతోంది. ఈసారి ఏఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఏంటి ఎజెండా? ప్రజలకు ఏం వరాలు కురిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో 11 తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

11న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. 9 తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన ప్రతిపాదిత అంశాలను పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది.

అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ.. దానికి సంబంధించిన తగు జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులపై చర్చించనున్నారు. ఇవికాక ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు, విదేశాల నుంచి వచ్చిన వారిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Tags:    

Similar News