జీవన్ రెడ్డి అప్పుడే పీసీసీ అధ్యక్షుడిలా ఫీలవుతున్నారా?
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్నేత జీవన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ జీవన్రెడ్డి పేరును కన్ఫార్మ్ చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ హైకమాండ్ ప్రకటించింది. శనివారం రైతులకు మద్దతుగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా వద్ద ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ మొదట మద్దతు ఇచ్చారని .. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి పిల్లిలా మారారని విమర్శించారు. కేసీఆర్ యూ టర్న్ సీఎం అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
హైదరాబాద్లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లగానే తొక ముడిచారని, సీఎం కేసీఆర్ శిఖండిలా వెనకడుగు వేశారని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీరు కాదు. ఇప్పటికే గ్రామాల్లో రైతు కొనుగోలు కేంద్రాలు బంద్ చేశారు. ఇలా అయితే టీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను గ్రామాల్లో తిరగనివ్వరు. వాళ్లను తరిమి తరిమి కొడతారు.
సోనియా గాంధీ ఎక్కడ పుట్టారంటూ కొందరు నీచంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎక్కడ పుట్టారన్నది అనవసరం. ఇప్పుడు ఆమె ప్రజల కోసం ఎలా పోరాటం చేస్తున్నారు? అన్నదే ముఖ్యం. సీఎం కేసీఆర్ రైతు బంధు అంటూ ఓ మోసపూరిత పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేమో కేంద్రంతో కుమ్మక్కై రైతులను ముంచేందుకు డిసైడ్ అయ్యారు. కేసీఆర్ యూ టర్న్ సీఎం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయం’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఓ వైపు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి జీవన్రెడ్డి పేరును ప్రకటిస్తారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డి తాజా కామెంట్లు చూస్తుంటే ఆయనకు పదవి ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లగానే తొక ముడిచారని, సీఎం కేసీఆర్ శిఖండిలా వెనకడుగు వేశారని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీరు కాదు. ఇప్పటికే గ్రామాల్లో రైతు కొనుగోలు కేంద్రాలు బంద్ చేశారు. ఇలా అయితే టీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను గ్రామాల్లో తిరగనివ్వరు. వాళ్లను తరిమి తరిమి కొడతారు.
సోనియా గాంధీ ఎక్కడ పుట్టారంటూ కొందరు నీచంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎక్కడ పుట్టారన్నది అనవసరం. ఇప్పుడు ఆమె ప్రజల కోసం ఎలా పోరాటం చేస్తున్నారు? అన్నదే ముఖ్యం. సీఎం కేసీఆర్ రైతు బంధు అంటూ ఓ మోసపూరిత పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేమో కేంద్రంతో కుమ్మక్కై రైతులను ముంచేందుకు డిసైడ్ అయ్యారు. కేసీఆర్ యూ టర్న్ సీఎం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయం’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఓ వైపు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి జీవన్రెడ్డి పేరును ప్రకటిస్తారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డి తాజా కామెంట్లు చూస్తుంటే ఆయనకు పదవి ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.