హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు..!
హైదరాబాద్కు మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితితో అనుబంధంగా పనిచేసే అర్బోర్ డే ఫౌండేషన్ హైదరాబాద్ను ‘టీ సిటీ ఆఫ్ ద వరల్డ్’ గా ఎంపిక చేసింది. దేశంలో ఏ నగరానికి ఇప్పటివరకు ఈ పురస్కారం దక్కలేదు. పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఈ సంస్థ కొనియాడింది. ఒక్క హైదరాబాద్ నగరంలో 2 కోట్ల 40 లక్షల మొక్కలు నాటడం గొప్ప విషయమని కొనియాడింది.
ఈ అంశంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్లే భాగ్యనగరానికి ఈ ఘనత దక్కిందని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్ మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మీద ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘హరితహారం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు ఎంపీ సంతోష్కుమార్ కూడా గ్రీన్ చాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో సెలబ్రిటీలు ప్రతిరోజు మూడు మొక్కలు నాటుతున్నారు.
మరోముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసురుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. ఇదిలా ఉంటే కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు.స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఫామ్హౌస్లో రుద్రాక్ష మొక్కను నాటారు.
ఈ అంశంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్లే భాగ్యనగరానికి ఈ ఘనత దక్కిందని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్ మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మీద ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘హరితహారం’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు ఎంపీ సంతోష్కుమార్ కూడా గ్రీన్ చాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో సెలబ్రిటీలు ప్రతిరోజు మూడు మొక్కలు నాటుతున్నారు.
మరోముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసురుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. ఇదిలా ఉంటే కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటారు.స్వయంగా సీఎం కేసీఆర్ కూడా ఫామ్హౌస్లో రుద్రాక్ష మొక్కను నాటారు.