మహిళల వివాహ వయస్సు పెంపు వల్ల నష్టాలే ఎక్కువట !

Update: 2020-08-26 23:30 GMT
మహిళల వివాహ వయస్సు పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతమున్న 18 ఏళ్ల కనీస వివాహ వయసును పెంచే యోచనలో ఉన్న కేంద్రం.. దీనిపై ఇప్పటికే ఓ  ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటుచేసింది.  స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని  మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విధానం పై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి.అమ్మాయిల వివాహ వయసు పెంచొద్దంటూ వందకుపైగా పౌర సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పెళ్ళికి అమ్మాయిల  వయో పరిమితిని పెంచడం వల్ల మహిళలకు కొత్తగా ఒరిగే  ప్రయోజనం లేదని , వారికీ నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పుకొచ్చాయి.

వయో పరిమితి పెంపు వల్ల మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పౌర సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పురుషులతో పాటు మహిళల వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచితే స్త్రీ-పురుష సమానత్వం రాదని.. పైగా మహిళా సాధికారతకు భంగం వాటిల్లుతుందని , వీలైతే పురుషుల వివాహ కనీస వయసును కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలని, దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు పాటిస్తున్నాయని తెలిపాయి. వయో పరిమితి పెంచే బదులు.. మహిళల ఉపాధికి చర్యలు తీసుకోవాలని కోరాయి. వివాహ వయసును పెంచడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోవని.. పైగా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని అన్నాయి. వయో పరిమితి పెంచడం వల్ల మహిళ, ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసాయి.

గత కొన్నేళ్లుగా చట్టపరమైన మార్పుల ద్వారా లక్ష్యాలను సాధించగలిగినట్లుగా చట్టాలను మరింత కఠినతరం చేయాలి, ఉన్నత విద్య, మంచి ఉద్యోగ కల్పన రూపంలో అవకాశాలను కల్పించకుండా 21 ఏళ్లు మహిళలకు కనీస వయస్సు వివాహ చట్టం కలిగి ఉండటం వల్ల యువతులు వారి తల్లిదండ్రుల ఇళ్లలోనే మరింత చిక్కుకుపోతారు అని చెప్పింది. కౌమారదశలో ముఖ్యంగా బాలికలలో పోషకాహార లోటును పరిష్కరించడానికి అంగన్‌వాడీలు, పాఠశాలల్లో కార్యక్రమాలను బలోపేతం చేయడం, అసురక్షిత గర్భస్రావం, వైద్య పద్ధతులను నివారించడంతో సహా అందరికీ ఆరోగ్యం, గర్భనిరోధకం, గర్భస్రావం సేవలకు విస్తృత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది.
Tags:    

Similar News