విదేశాల నుంచి భార‌తీయులు ఒక్కరోజుకి పంపేది ఎన్ని వేల కోట్లంటే !

Update: 2021-05-15 23:30 GMT
మనదేశంలో సరైన ఉపాధి లేక కొందరు , విదేశాల్లో మంచి అవకాశం వచ్చి మరికొందరు డబ్బు సంపాదన కోసం ఉన్నవారిని , సొంత దేశాన్ని వదిలి కానరాని రాజ్యానికి వెళ్లి అక్కడ పని చేసే ఖర్చులకి పోను మిగిలిన డబ్బుని ఇండియాకి పంపిస్తుంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సంపాదించిన డబ్బు నుండి ఎక్కువ భాగాన్ని తీసి ఇంట్లో వారికి పంపించడం అనేది భారతీయులు గత కొన్నేళ్లుగా పాటిస్తూనే ఉన్నారు. అదొక అలవాటు. హైద‌రాబాద్ , చెన్నై , బెంగుళూరు ఇలా ఏ నగరానికి ఉద్యోగం కోసం వెళ్లినా కూడా  అక్కడ వారికి వచ్చే జీతంలో స‌గ భాగాన్ని అయినా సొంతూళ్లోని త‌ల్లిదండ్రుల‌కు పంపే వారు పదిలో తొమ్మిది మంది ఉన్నారు. ఇదే తీరు విదేశాల‌కు వెళ్లినా కొన‌సాగుతుంది.

త‌మ వారి ఖాతాల్లోకి డ‌బ్బు జ‌మ చేసినా, విదేశాల్లో సంపాదించి స్వ‌దేశంలో ఆస్తుల కొనుగోలు చేసినా, భారీ మొత్తాల‌ను అయితే భార‌తీయులు ఇండియాకు పంపుతున్నారు. గ‌త ఏడాదికి సంబంధించి ఈ గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. విదేశాల నుంచి ఇండియ‌న్స్ ఇండియాకు పంపిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏడాది సమయంలో విదేశాల్లో ఉన్న మనదేశం వారు ఇండియాకు పంపించిన డ‌బ్బు మొత్తం ఆరు ల‌క్ష‌ల కోట్ల‌కు పైనే.  ఆరు ల‌క్ష‌ల కోట్లు అంటే..దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలు కొన్నింటిని క‌లిపినా వాటన్నింటి వాస్త‌విక బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువే. విదేశాల్లో సంపాదిస్తూ, అక్క‌డ త‌మ ఖ‌ర్చులు పోనూ మిగిలిన మొత్తాల‌నే వారు ఇండియాకు పంపిస్తుంటారు. అయినా ఆరు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఏడాది వ్య‌వ‌ధిలో పంపించారంటే భార‌తీయులు ఎంత శ్రద్దగా పని చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. దీన్ని రోజువారీగా చూస్తే.. రోజుకు 1,670 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని విదేశాల్లోని భార‌తీయులు మనదేశానికి పంపుతున్నారు. ఇక ఇండియా కి  ఎక్కువ మొత్తం బ‌దిలీ అవుతున్న‌ది అమెరికా నుండే కావడం విశేషం. ఆ త‌ర్వాత యూఏఈ, సౌదీ నుంచి భారీ మొత్తాలు భార‌త్ కు బ‌దిలీ అవుతున్నాయి. ఈ త‌ర‌హాలో విదేశాల నుంచి ఎక్కువ డ‌బ్బును పొందుతున్న దేశంలో ఇండియానే నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఇక, చైనా రెండో స్థానంలో ఉంది.
Tags:    

Similar News