ఫేస్‌ బుక్ ఫ్రెండ్‌ తో లేచిపోయిన భార్య..ఇదే కారణం!

Update: 2020-06-06 02:30 GMT
ఈ సమాజంలో రోజురోజుకు అక్ర‌మ సంబంధాలకు సంబంధించిన  కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వాడకం పెరిగిన ఇలాంటి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మ‌హిళ‌లు, పురుషులు అన్న తేడాలేకుండా ఖాళీ స‌మ‌యం దొరికితే సోషల్ మీడియాకి అతుక్కుపోతుండటం కారణంగా ఇటీవలి కాలంలో కాపురాలు కూలిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ఉండే చాటింగ్ యాప్ ల ద్వారానూ, వీడియో కాలింగ్ ల ద్వారా, ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా ఎక్కడెక్కడి వాళ్లతోనో పరిచయాలు ఏర్పడి వాటి మూలంగా కూలిపోతున్న కాపురాలు లెక్కలేనన్ని ఉంటున్నాయి.

తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. తొమ్మిదేళ్లు భ‌ర్త‌తో కాపురం చేసిన వివాహిత‌.. ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయిన వ్య‌క్తితో లేచిపోయింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం, కొత్లాపూర్ కు చెందిన విక్రమ్ గౌడ్ అదే గ్రామానికి చెందిన అనితను తొమ్మిదేళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సంతానం కలగలేదు. అనితకు కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో అలీ ఇమ్రాన్‌ షేక్‌ అనే వ్యక్తితో  పరిచయం అయ్యింది. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సేవు అనిత  అతడితో ఫేస బుక్ లో చాటింగ్ చేసేది.

ఈ క్రమంలో వారిద్దరూ ఫోన్ నెంబర్లు తెలుసుకుని ఫోన్ లో మాట్లాడుకునే దాకా వెళ్లారు.మే 26 వ తేదీన అనిత ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదు. భార్య ఆచూకి కోసం తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద గాలించినా విక్రమ్ గౌడ్ కు ఫలితం కనిపించలేదు.  దీంతో తన భార్య ఫేసు బుక్ ద్వారా పరిచయం అయిన ఫ్రెండ్ తోనే వెళ్లిపోయి ఉంటుందని అనుమానించాడు. అతని వివరాలు తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ప్రోఫైల్ చెక్ చేయగా  ఆ అకౌంట్ క్లోజ చేసినట్లు వచ్చింది. దీంతో  గురువారం తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags:    

Similar News