రెండో భార్యను దారుణంగా అవమానించారు

Update: 2016-02-08 09:29 GMT
ఇటీవల బెంగళూరులో టాంజేనియా మహిళను వివస్త్ర ను చేసిన దారుణ ఘటన మరవక ముందే అలాంటిదే మరో ఘటన తెలంగాణలో జరిగింది. ఓ మహిళలను వివస్తన్రు చేసి, ఆమె శరీరంపై కాల్చిన ఇనుప చువ్వలతో గాయాలు చేసి వీధిలో ఊరేగించిన దారుణ ఉదంతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డిసి తండాలో సోమవారం జరిగింది.

వర్ధన్న పేట డీసీ తండాలో రవి అనే వ్యక్తి రెండో భార్య అనితపై ఆయన మొదటి భార్య బంధువులు కిరాతకంగా దాడి చేశారు. దాడిచేసి ఆమెను కొట్టడమే కాకుండా అనితను వివస్త్రను చేసి ఆమె ఒంటిపై కాల్చిన ఇనుపచువ్వతో గాయాలు చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెను అలాగే బట్టల్లేకుండా వీధిలో తిప్పారు. అత్యంత పాశవికంగా సాగిన ఈ దాడి పట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు తండాకు చేరుకుని అనితను ఆస్పత్రికి తరలించారు.

జరిగింది దారుణ సంఘటన కావడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి. సంఘటన పూర్వాపరాలు తెలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
Tags:    

Similar News