మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 1. 25 కోట్లు స్వాహా ... భర్తకి తెలియడంతో ఏంచేసాడంటే ?

Update: 2020-11-16 12:10 GMT
సంపన్నుల కుటుంబానికి చెందిన యువతీ , మరో యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకంటూ ఇష్టం వచ్చినట్టు తిరిగారు.  అయితే , వారి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. 10 సంవత్సరాల క్రితం వేరే యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి అతనితో కాపురం చేసుకుంటుంది. ఇన్ని ఏళ్ల  తరువాత నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో మాజీ ప్రియురాలు అక్షరాల రూ. 1. 25 కోట్లు సమర్పించుకుంది. అయితే ఇంకా డబ్బులు కావాలని మాజీ ప్రియుడు టార్చర్ పెట్టడంతో , భర్త ఎంట్రీ ఇచ్చి సమస్య పరిష్కారానికి ఓ దారి చూపాడు.

బెంగళూరులో నివాసం ఉంటున్న మహేష్ అనే యువకుడు, బెంగళూరు సిటీలోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న లక్ష్మి  (పేరు మార్చాము) 12 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు.  లక్ష్మి , మహేష్  పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కోటీశ్వరురాలైన లక్ష్మి  మహేష్ ను పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించి మహేష్ ను పెళ్లి చేసుకుంటే లేనిపోని కష్టాలు ఎదురౌతాయని, నువ్వు సుఖంగా సంసారం చెయ్యలేవని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు లక్ష్మికి బ్రైన్ వాష్ చేశారు. దానితో ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకుంది.

10 సంవత్సరాల క్రితం కోటీశ్వరుడైన మరో వ్యక్తి  తో లక్ష్మి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. రష్మి పెళ్లి సమయంలో ఆమె ప్రియుడు మహేష్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే ... కొన్ని నెలల క్రితం రష్మికి ఆమె ప్రియుడు మహేష్ ఫోన్ చేశాడు. నువ్వు ఎలా ఉన్నావ్ , నీ కాపురం ఎలా ఉంది  నీ భర్త, కొడుకు బాగున్నారా  అంటూ ఆమెను మంచితనంతో మాట్లాడుతూ వచ్చాడు. తమ మాజీ ప్రియుడు మహేష్ మనసులో ఏమీ పెట్టుకోకుండా తనతో మంచిగా మాట్లాడుతున్నాడని లక్ష్మి గుడ్డిగా నమ్మి నాలుగు నెలల పాటు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తూ వచ్చింది.

 అంతే నెల రోజుల క్రితం మహేష్ బాంబు పేల్చాడు. నీ నగ్న ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. తనకు రూ. 1. 20 కోట్లు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ జీవితం నాశనం అయిపోతుందని మహేష్ మాజీ ప్రియురాలు లక్ష్మిని బ్లాక్ మెయిల్ చేశాడు. దీనితో భయంతో అడిగినంత తెలిసినవారి వద్ద తీసుకోని ఇచ్చేసింది. రూ. 1. 20 కోట్లు డబ్బులు ఇచ్చినా మహేష్ మళ్లీ తనకు రూ. 1 కోటి ఇవ్వాలని ప్రియురాలు లక్ష్మిని వేధింపులకు గురిచేశాడు. అయితే అంత డబ్బులు ఇవ్వలేక, మాజీ ప్రియుడు మహేష్ టార్చర్ తట్టుకోలేని నెల రోజుల పాటు రష్మి నరకం అనుభవించింది. ఇక లాభం లేదని తెలుసుకున్న లక్ష్మి జరిగిన విషయం మొత్తం భర్త   కు చెప్పింది. తన భార్య రష్మి బాధచూసి  తట్టుకోలేక ఆమె భర్త రాకేష్ నేరుగా వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ చేరుకుని తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అతనే కేసు పెట్టాడు.  నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి మహేష్, అతనికి సహకరించిన రష్మి నుంచి తన బ్యాంకు అకౌంట్ కు డబ్బులు డిపాజిట్ చేయించుకున్న అపర్ణను పోలీసులు అరెస్టు చేశారు
Tags:    

Similar News