ఏనుగు ఘటన మరువక ముందే...గర్భిణి ఆవును కూడా ...!

Update: 2020-06-06 11:30 GMT
కేరళ గర్భిణి అయిన ఏనుగుకి టపాసులు కూర్చిన పైనాపిల్ తినిపించి దాని ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. దీని పై సెలబ్రిటీల దగ్గరనుండి సామాన్యుల వరకు తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే హిమాచల్ ప్రదేశ్‌ లో మరో దారుణం చోటుచేసుకుంది. కడుపుతో ఉన్న ఆవుకు పేలుడు పదార్థాలు తినిపించి ఘోరానికి పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని బిలాస్పూర్ జిల్లా జాందుత్తలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

పొలంలోని గడ్డిలో దాచిన పేలుడు పదార్థాన్ని తిన్న ఆవు దవడ పేలిపోయి రక్తసిక్తమైంది. ఈ వీడియోను యజమాని గురుదయాళ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పొరుగింట్లోని నందలాల్ అనే వ్యక్తే ఈ దురాగతానికి పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత నందలాల్ పారిపోవడం అనుమానాలకూ బలం చేకూరుస్తోంది. కాగా బాంబు కారణంగా ఆవు దవడ ఛిద్రమైపోయింది. దాంతో ఆ ఆవు గడ్డి కూడా తినలేకపోతుంది. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News