హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగి !

Update: 2020-08-10 08:50 GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం , ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటిపోవడంతో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అలాగే పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని , దైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని కోరుతున్నారు. కానీ , కొందరు కరోనా వైరస్ సోకిందని , భయంతో ఆత్మహత్య కి పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది.

ప్రకాశం జిల్లా.  మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రాధాకృష్ణా రెడ్డి మూడు రోజుల క్రితం కొంచెం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి స్థానింకగా కరోనా పరీక్షలు నిర్వహించగా , కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలు జీజీహెచ్ ‌కు తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీజీహెచ్‌ లోని మేల్ రెసిడెన్సీ క్వార్టర్స్ నుండి ఎక్స్ రే కోసం తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మానసిక స్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Tags:    

Similar News