ఐపీఎల్ ను వీడని కరోనా !

Update: 2020-09-03 09:10 GMT
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన భారత క్రికెట్‌ బృందాన్ని కరోనా మహమ్మారి బెడద తీరడంలేదు. ఇప్పటివరకూ చెన్నై సూపర్‌ కింగ్స్  టీం లో కలకలం రేపిన కరోనా మహమ్మారి  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కు పాకింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్ ‌లోని సభ్యునికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో వారికి కరోనా నెగిటివ్‌ రావడంతో సీఎస్‌ కే  బయటపడింది.

అయితే ఇప్పుడు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యుడికి కరోనా రావడంతో మరోసారి కలవరం మొదలైంది. ఇదిలా ఉంచితే, బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ లో ఉన్న ఇద్దరు సభ్యలకు కరోనా సోకిన విషయాన్ని సైతం బోర్డు సీనియర్‌ అధికారి ప్రకటించారు. ‘ దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు కరోనా సోకిన విషయం నిజమే. కానీ ప్రస్తుతం ప్రాబ్లం ఏమీ లేదు. అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఎవరితోనూ అతని కాంటాక్ట్‌ లేదు. యూఏఈకి వెళ్లే సమయంలో కూడా  ఏ క్రికెటర్‌ తోనే అతను కాంటాక్ట్‌ కాలేదు. ఆ మెడికల్‌ ఆఫీసర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తదుపరి టెస్టుల నాటికి అతనికి నెగిటివ్‌ వస్తుందని ఆశిస్తున్నాం. ఎన్ ‌సీఏలో ఇద్దరి సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది అని సదరు అధికారి వెల్లడించారు.
Tags:    

Similar News