చైనాలో ఐ ఫోన్స్ బ్యాన్ .. కారణం ఇదే !
గత కొన్నిరోజులుగా చైనా , అమెరికా మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. చైనాలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుండి అమెరికా చైనాపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పటికే చైనా పై పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న అమెరికాకి చైనా తాజాగా షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్ టాక్ తోపాటు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్ నిషేధం తప్పదంటున్న అమెరికాపై చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. అమెరికా తమ దేశానికి చెందిన వీ చాట్ ను బ్యాన్ చేస్తే.. అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్పత్తులను కూడా బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది.
ఈ మేరకు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్వీట్ చేశారు. వీచాట్ ను బ్యాన్ చేస్తే చైనీయులు చేసే ఐఫోన్లు, ఇతర ఉత్పత్తుల వాడకాన్ని చైనా వాసులు నిలిపివేస్తారని, వారు కూడా నిషేధిస్తారని వెల్లడించారు. చైనాకు చెందిన వీ చాట్ యాప్ ను నిషేధించాక అమెరికాకు చెందిన ఆపిల్ ఐఫోన్లను, ఇతర ప్రొడక్ట్స్ ను చైనా వాసులు వాడడంలో అర్థం లేదన్నారు. మరోవైపు దీనిపై చైనాకు చెందిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించడం విశేషం. ఆపిల్ ఫోన్ ను ఉపయోగిస్తాను, దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను అని వీబో ప్లాట్ ఫామ్ వినియోగదారుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది సంఘర్షణ కాదు అని తెలిపారు. ఆపిల్ ఎంత మంచిదైనా నో మేటర్, తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ఆధునిక చైనా ప్రజలు వీచాట్ ను విడిచిపెడితే ఆత్మను కోల్పోయినట్టే, ముఖ్యంగా వ్యాపారవేత్తలు అని వాదించారు. అయితే చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలపై అమెరికా కానీ, అటు ఆపిల్ కంపెనీ గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా చైనాకు చెందిన వీచాట్ యాప్లో ప్రస్తుతం1.2 బిలియన్ల మంది వినియోగదారులున్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 2020 రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం ఆపిల్ వాటా 8 శాతం మాత్రమే..చైనాలో హువావే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు తమ అమెరికా బిజినెస్ ను ఇతర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్రయించాలంటూ తెలిపారు.
ఈ మేరకు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్వీట్ చేశారు. వీచాట్ ను బ్యాన్ చేస్తే చైనీయులు చేసే ఐఫోన్లు, ఇతర ఉత్పత్తుల వాడకాన్ని చైనా వాసులు నిలిపివేస్తారని, వారు కూడా నిషేధిస్తారని వెల్లడించారు. చైనాకు చెందిన వీ చాట్ యాప్ ను నిషేధించాక అమెరికాకు చెందిన ఆపిల్ ఐఫోన్లను, ఇతర ప్రొడక్ట్స్ ను చైనా వాసులు వాడడంలో అర్థం లేదన్నారు. మరోవైపు దీనిపై చైనాకు చెందిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించడం విశేషం. ఆపిల్ ఫోన్ ను ఉపయోగిస్తాను, దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను అని వీబో ప్లాట్ ఫామ్ వినియోగదారుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది సంఘర్షణ కాదు అని తెలిపారు. ఆపిల్ ఎంత మంచిదైనా నో మేటర్, తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ఆధునిక చైనా ప్రజలు వీచాట్ ను విడిచిపెడితే ఆత్మను కోల్పోయినట్టే, ముఖ్యంగా వ్యాపారవేత్తలు అని వాదించారు. అయితే చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలపై అమెరికా కానీ, అటు ఆపిల్ కంపెనీ గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా చైనాకు చెందిన వీచాట్ యాప్లో ప్రస్తుతం1.2 బిలియన్ల మంది వినియోగదారులున్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 2020 రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం ఆపిల్ వాటా 8 శాతం మాత్రమే..చైనాలో హువావే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు తమ అమెరికా బిజినెస్ ను ఇతర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్రయించాలంటూ తెలిపారు.