చపాతీ తో చూపు కోల్పోయిన బాలుడు..రిపోర్ట్స్ చూసి డాక్టర్లు షాక్
అతి సర్వత్రా వర్జయేత్...దీని అర్థం ఏమిటంటే , దేనిని అతిగా చేయడం మంచిది కాదు. ముఖ్యంగా తిండి విషయంలో ఎంత రుచిగా ఉన్నా, మన కడుపుకు సరిపోయేంతనే తినాలి తప్ప, అతిగా లాగించకూడదు. కాదని బాగా తింటే, ఎంతటి తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో అందరికి తెలియజెప్పే సంఘటనే ఇది. సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్ 100-150 వరకు ఉంటే సాధారణంగా భావిస్తారు. అదే చిన్నపిల్లల్లో ఆహారం తీసుకున్న తర్వాత 200 ఉన్నా ఫర్వాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన 12ఏళ్ల బాలుడికి షుగర్ లెవర్ ఏకంగా 1200 దాటేసింది. దీంతో అతడు కంటిచూపు కోల్పోవడంతో పాటు శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం మానేశాయి.
ఇంతకీ ఆ పిల్లోడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా, అతిగా చపాతీలు తినడం వల్ల. ఈ విషయం తెలిసి డాక్టర్లు సైతం షాకవుతున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా ఖోడ్ గ్రామంలో సందీప్ అనే బాలుడికి కొద్దిరోజులుగా కంటిచూపు తగ్గుతూ వస్తోంది. చివరికి ఓ రోజు సడెన్ గా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే. అక్కడ సందీప్ ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు.
సందీప్ కు షుగర్ లెవల్స్ 1200 కంటే ఎక్కువగా పెరిగిపోయాయని, అందువల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోయినప్పటికీ అతడు శ్వాస తీసుకోవడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడంతో ప్రాణానికి హాని లేదని తెలిపారు. అయితే సందీప్కు షుగర్ లెవ్ 1206 ఎందుకు వచ్చిందని అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి తండ్రిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సందీప్ రోజూ 40 చపాతీలు తినేవాడు. దీనివల్ల అతడి తలలో చీము చేరుకుంది. దానివల్లే కంటిచూపు కోల్పోయాడని నిర్ధారించిన డాక్టర్లు అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును వెలికితీశారు.
దీంతోపాటు బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించేందుకు 6యూనిట్ల ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. బాలుడు డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధితో బాధపడుతున్నాడని, కళ్లకు వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని సూచించారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఐదు రోజుల వ్యవధిలోనే ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పుడు సందీప్ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు.
ఇంతకీ ఆ పిల్లోడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా, అతిగా చపాతీలు తినడం వల్ల. ఈ విషయం తెలిసి డాక్టర్లు సైతం షాకవుతున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా ఖోడ్ గ్రామంలో సందీప్ అనే బాలుడికి కొద్దిరోజులుగా కంటిచూపు తగ్గుతూ వస్తోంది. చివరికి ఓ రోజు సడెన్ గా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి.. పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం మానేశాయి. అతడు కేవలం ఊపిరి తీసుకోగల్గుతున్నాడు అంతే. అక్కడ సందీప్ ను పరీక్షించిన వైద్యులు.. అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు.
సందీప్ కు షుగర్ లెవల్స్ 1200 కంటే ఎక్కువగా పెరిగిపోయాయని, అందువల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. శరీరంలో ఎలాంటి కదలిక లేకపోయినప్పటికీ అతడు శ్వాస తీసుకోవడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడంతో ప్రాణానికి హాని లేదని తెలిపారు. అయితే సందీప్కు షుగర్ లెవ్ 1206 ఎందుకు వచ్చిందని అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి తండ్రిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సందీప్ రోజూ 40 చపాతీలు తినేవాడు. దీనివల్ల అతడి తలలో చీము చేరుకుంది. దానివల్లే కంటిచూపు కోల్పోయాడని నిర్ధారించిన డాక్టర్లు అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును వెలికితీశారు.
దీంతోపాటు బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించేందుకు 6యూనిట్ల ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. బాలుడు డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధితో బాధపడుతున్నాడని, కళ్లకు వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని సూచించారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఐదు రోజుల వ్యవధిలోనే ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పుడు సందీప్ చూడగల్గుతున్నాడు. ప్రస్తుతం సందీప్కు ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు వెల్లడించారు.