చంద్రుడిపై బిలం గుర్తించిన చంద్రయాన్-2 ఆర్బిటర్... ఫోటోలు పంపిందంటూ ఇస్రో కీలక ప్రకటన !
చంద్రుడిపై పరిశోధనలకి సంబంధించి గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ..దాదాపుగా విజయం ముగింట నిలిచి , కొద్ది సెకన్ల తేడా తో విజయాన్ని సాధించలేకపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగుతూ గమ్యస్థానానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. దీనితో చంద్రయాన్-2 నుండి భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. అయితే, చంద్రుడి కక్ష్య చుట్టూ ఆర్బిటర్ పరిభ్రమిస్తోంది. తాజాగా, ఆర్బిటర్ లోని కెమెరా చంద్రుడి ఉపరితలంపై బిలంను గుర్తించి, ఫోటోలు తీసింది. దీనికి భారత అంతరిక్ష ప్రయోగాల పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరును సూచించారు.
అమెరికా అపోలో 17, రష్యా లూనా 21 మిషన్ ల్యాండింగ్ సైట్కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని ఆర్బిటర్ గుర్తించింది. జులై 30న టీఎంసీ-2 డిజిటల్ ఎలివేషన్ మోడల్, ఆర్థో ఇమేజ్ ఉపయోగించి బిలంను త్రీ డైమన్షనల్ ను రూపొందించినట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ చంద్రయాన్-2 ఆర్బిటర్, చంద్రుడి ఉపరితలంపై బిలాన్ని ఫోటో తీసింది. ఈ బిలానికి చాలా కాలం కిందట సారాభాయ్ పేరు సూచించినా, మనం స్వంతంగా చంద్రుని కక్ష్యలో దానిని గుర్తించాలని మేము కోరుకున్నాం ఆర్బిటన్ ఆ పని చక్కగా చేసింది అన్నారు.
మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మెషీన్ కోసం సిద్ధమైన భారత్.. ఇందుకు సంబంధించి వ్యోమగాములకు శిక్షణ కొనసాగుతోంది. ఆగస్టు 2022 నాటికి ఈ ప్రయోగాన్ని పూర్తిచేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలో ప్రస్తుతం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారని, ఈ శిక్షణ వచ్చే ఏడాది లో పూర్తీ అయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
అమెరికా అపోలో 17, రష్యా లూనా 21 మిషన్ ల్యాండింగ్ సైట్కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని ఆర్బిటర్ గుర్తించింది. జులై 30న టీఎంసీ-2 డిజిటల్ ఎలివేషన్ మోడల్, ఆర్థో ఇమేజ్ ఉపయోగించి బిలంను త్రీ డైమన్షనల్ ను రూపొందించినట్టు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ చంద్రయాన్-2 ఆర్బిటర్, చంద్రుడి ఉపరితలంపై బిలాన్ని ఫోటో తీసింది. ఈ బిలానికి చాలా కాలం కిందట సారాభాయ్ పేరు సూచించినా, మనం స్వంతంగా చంద్రుని కక్ష్యలో దానిని గుర్తించాలని మేము కోరుకున్నాం ఆర్బిటన్ ఆ పని చక్కగా చేసింది అన్నారు.
మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మెషీన్ కోసం సిద్ధమైన భారత్.. ఇందుకు సంబంధించి వ్యోమగాములకు శిక్షణ కొనసాగుతోంది. ఆగస్టు 2022 నాటికి ఈ ప్రయోగాన్ని పూర్తిచేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలో ప్రస్తుతం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారని, ఈ శిక్షణ వచ్చే ఏడాది లో పూర్తీ అయ్యే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.