జాతీయ స్థాయిలో సంలచంగా మారిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో కొత్త పేరు బయటకు వచ్చింది.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు.. అహ్మద్ పటేల్ లాంటి పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తూ.. రోజుకో సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తాజాగా ఒక ఆసక్తికర పేరు బయటకు వచ్చింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ హస్తం కూడా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఏపీ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. తాను ఇదే విషయాన్ని 2012లో రాజ్యసభలో ప్రస్తావించానని.. అప్పటి కాంగ్రెస్ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ మీద ఖమ్మం జిల్లాలో కేసు నమోదు అయ్యిందని.. సీబీఐతో కానీ విచారణ జరిపిస్తే.. పూర్తి స్థాయిలో నిజాలు బయటపడటం ఖాయమని సీఎం రమేశ్ చెబుతున్నారు.
ఓపక్క దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో బ్రదర్ అనిల్ కుమార్ పేరు రావటం ఆసక్తికరమైతే.. ఎలా అన్న విషయం మీద సీఎం రమేశ్ మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. మరి.. బ్రదర్ అనిల్ పై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందిస్తుందా? వైఎస్సార్ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పొచ్చు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ హస్తం కూడా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఏపీ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్. తాను ఇదే విషయాన్ని 2012లో రాజ్యసభలో ప్రస్తావించానని.. అప్పటి కాంగ్రెస్ సర్కారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ మీద ఖమ్మం జిల్లాలో కేసు నమోదు అయ్యిందని.. సీబీఐతో కానీ విచారణ జరిపిస్తే.. పూర్తి స్థాయిలో నిజాలు బయటపడటం ఖాయమని సీఎం రమేశ్ చెబుతున్నారు.
ఓపక్క దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో బ్రదర్ అనిల్ కుమార్ పేరు రావటం ఆసక్తికరమైతే.. ఎలా అన్న విషయం మీద సీఎం రమేశ్ మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. మరి.. బ్రదర్ అనిల్ పై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందిస్తుందా? వైఎస్సార్ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పొచ్చు.