హైదరాబాద్ లో కూర్చుంటే ఎలా..బాబుకు అయ్యన్న షాక్

Update: 2020-09-10 04:45 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై సొంత పార్టీలోనే అలజడి చెలరేగింది. మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు బాబుకు షాకిచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు టీడీపీని కుదిపేస్తున్నాయి.

చంద్రబాబు తీరును అయ్యన్న పాత్రుడు తీవ్రంగా తప్పుపట్టినట్టు సమాచారం. పార్టీలో బలోపేతంపై ఫోకస్ పెట్టకుండా జూమ్ లో ఆన్ లైన్లో ప్రెస్ మీట్లతో పార్టీ బాగుపడదని అయ్యన్న హితవు పలికారట.. నాలుగురోజుల క్రితం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారట.. ఈ క్రమంలోనే అయ్యన్న తన అసంతృప్తిని వెళ్లగక్కాడట..

హైదరాబాద్లోనే చంద్రబాబు ఎక్కువగా గడుపుతున్నారని.. ఎప్పుడైనా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని.. ఇలా చేయడం సరికాదని అయ్యన్న కుండబద్దలు కొట్టాడట.. ప్రజల్లోకి వెళ్లకుండా ఆన్ లైన్ సమావేశాలు, మీడియా హడావుడితో సరిపెడితే పార్టీకి భవిష్యత్ ఉండదని అభిప్రాయపడ్డారట..

టీడీపీలో కొందరు ప్రచారం కోసమే పనిచేస్తున్నారని వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదని అయ్యన్న కుండబద్దలు కొట్టాడట.. పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్ లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించినట్టు తెలిస్తోంది. ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరని కాస్త ఘాటుగానే చెప్పారట..

కాగా అయ్యన్న వ్యాఖ్యలతో చంద్రబాబుతోపాటు పార్టీ నేతలు కూడా ఒకింత షాకయ్యారని తెలిసింది. అందుకే చంద్రబాబు లోకేష్ ను హైదరాబాద్ నుంచి ఏపీకి పంపించారని చర్చ జరుగుతోంది. దీనిపై టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News