బెజవాడలో న్యూస్ ఛానల్ ఆఫీసుపై దాడి?

Update: 2016-02-06 09:00 GMT
వారం క్రితం తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఒక మీడియా అధిపతి ఉన్న విషయం తెలిసిందే. నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధిపతిని కూడా తునిలోచోటు చేసుకున్న హింసలో నిందితుడిగా చేరుస్తూ ఆయనపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా బెజవాడలోని సదరు న్యూస్ ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేయటం సంచలనంగా మారింది.

గుర్తు తెలియని కొందరు న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కారణంగా ఆఫీసు భవనం అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మొత్తంగా ఒక మీడియా కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News