తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు !

Update: 2020-09-24 09:50 GMT
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు వాదించడానికి తిరుమలకి వెళ్లిన ఏపీ సీఎం జగన్ .. పంచెకట్టు, తిరునామాలతో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత ఈ రోజు ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు  సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి జగన్ సాదర‌ స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

 ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు. ఇక , శ్రీవారి దర్శనము ముగించుకుని  ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇద్దరు సీఎంలు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం  కరోనా నేపథ్యంలో టీటీడీ  గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు పాల్గొన్నారు. ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు.
Tags:    

Similar News