వెలుగులోకి దేవికారాణి ‘ రియల్ ఎస్టేట్’ దందా !
ఈఎస్ ఐ కి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి గురించి విచారణ జరిగికొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్ ఎస్టేట్ లావాదేవీ లను సైతం తాజాగా బయటపెట్టింది. వైద్య బీమా సంస్థలో అవినీతికి పాల్పడటం ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఆమె రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించారని, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి ఆరు ఫ్లాట్లను కొనేందుకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సొమ్మును ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
మొత్తం రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలు కు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. ఈ వ్యవహారం పై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్ కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతం లో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తుడిచి పెట్టింది.
మొత్తం రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలు కు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. ఈ వ్యవహారం పై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్ కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతం లో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తుడిచి పెట్టింది.