పోలీసులకు లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు!
సాధారణంగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ప్రాభవం ఎక్కువగా ఉంటుంది. అయితే, గత కొన్ని రోజులుగా ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. దంతెవాడ జిల్లా అటవి ప్రాంతంను రెడ్ కారిడార్ మార్చుకున్న మావోయిస్టులకు అక్కడి స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనితో ఈ మధ్య కాలం లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు
తాజాగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో మరో 27 మంది మావోయిస్టులు పోలీసులకి లొంగిపోయారు. తాజాగా లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు నలుగురు ఉన్నారు. వారిపై లక్ష రూపాయల రివార్డ్ కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు నిర్ణయించిన పునరావాస చర్యలు ప్రభావితం చేయడంతోనే వారు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కౌకొండ పోలీస్ స్టేషన్ లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టుల తోపాటు మొత్తం 25 మంది లొంగిపోయారు. వీరితోపాటు ప్రకాశ్ కర్తామీ అలియాస్ పండు , హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ముందు లొంగిపోయారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు.
తాజాగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో మరో 27 మంది మావోయిస్టులు పోలీసులకి లొంగిపోయారు. తాజాగా లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు నలుగురు ఉన్నారు. వారిపై లక్ష రూపాయల రివార్డ్ కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు నిర్ణయించిన పునరావాస చర్యలు ప్రభావితం చేయడంతోనే వారు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కౌకొండ పోలీస్ స్టేషన్ లో సీనియర్ అధికారుల ఎదుట నలుగురు మహిళా మావోయిస్టుల తోపాటు మొత్తం 25 మంది లొంగిపోయారు. వీరితోపాటు ప్రకాశ్ కర్తామీ అలియాస్ పండు , హద్మీ అనే మరో మావోయిస్టు జంట దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ముందు లొంగిపోయారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు చాలా ఆపరేషన్లలో పాల్గొన్నట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు.