కంటతడి పెట్టిన షర్మిల... జగన్ పై సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-10 14:22 GMT

సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంక 24గంటల వ్యవధి కూడా లేదు! ఈ సమయంలో ఏపీ రాజకీయం పీక్స్ కి చేరిపోతోంది! పార్టీల అధినేతలు, నేతలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. అలుపెరగకుండా ప్రజలను కలుస్తున్నారు.. వారి మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టారు.

అవును... ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రమంతా ఒకెత్తు, కడప లోక్ సభ పరిధిలో ఎన్నిక ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పోటీ చేసేది అవినాష్ అయినా... వ్యవహారం మాత్రం జగన్ వర్సెస్ భారతి అన్నట్లుగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీని హైజాక్ చేసేదాన్ని..!:

రాజకీయ కాంక్షతోనే తాను కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారని మొదలుపెట్టిన షర్మిళ... అసలు తనను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? అని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జగన్ భవిష్యత్‌ కోసం తన కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదని షర్మిళ తెలిపారు.

వాస్తవానికి తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అంతా తన చుట్టే తిరిగిందని చెప్పిన షర్మిళ... తనకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే పార్టీని హైజాక్‌ చేసేదాన్ని కాదా? అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో... "మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా?" అని సూటిగా ప్రశ్నించారు షర్మిళ!

Read more!

బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా?:

ఈ సందర్భంగా తనకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? అని జగన్ ని సూటిగా ప్రశ్నించిన షర్మిళ... మీరు సీఎం అయ్యే వరకు అన్న అని మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా? అని అడిగారు.

ఇదే క్రమంలో... "నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను.. మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను.. మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌ పై ప్రమాణం చేయగలరా? అని షర్మిళ సవాల్ విసిరారు!

వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం!:

ఇదే క్రమంలో... సోషల్‌ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన షర్మిళ... రాజన్న బిడ్డ అనే ఇంగితం కూడా లేకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అని అన్నారు. ఫలితంగా... తనపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పిన షర్మిళ.. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? అని ప్రశ్నించారు.

దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా?:

4

ఇక వివేకా హత్య వ్యవహారంలో అవినాష్ చెబుతున్న వెర్షన్ లాజికల్ గా ఉందని చెబుతూ.. అతడు తప్పు చేయలేదని తాను నమ్ముతున్నట్లు జగన్ చెప్పిన విషయంపైనా షర్మిళ స్పందించారు! ఇందులో భాగంగా.. తాను నిర్దోషి అని అవినాష్ రెడ్డి నాలుగు ఇంటర్వ్యూల్లో చెబితే చూసి కన్విన్స్‌ అవ్వడానికి మీరెవరు..? రాజ్యాంగమా..? చట్టమా..? కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ అని షర్మిళ తెలిపారు.

నిజంగా నిర్దోషులైతే సీబీఐ వస్తే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రశ్నించిన షర్మిళ... దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? దొంగ మాటలు పిచ్చోళ్లే నమ్ముతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News