కూకట్ పల్లి కామ పిశాచుల ఆచూకీ లభ్యం.. వారిద్దరిది సంగారెడ్డే!

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుల బైక్ ఆధారంగా వారిని ట్రేస్ చేశారు.

Update: 2024-04-23 04:15 GMT

కామదాహంతో కన్నుమిన్ను కానరాకుండా అత్యంత క్రూరంగా.. దారుణంగా అత్యాచారానికి గురి చేసి.. ఒక మహిళ మరణానికి కారణమైన ఇద్దరు నిందితుల్నిపోలీసులు గుర్తించారు. సంచలనంగా మారిన కూకట్ పల్లి మహిళ అత్యాచార ఉదంతంలో బాధ్యులైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఉదంతంలో.. ఘటనా స్థలంలోనే తీవ్రమైన రక్తస్రావంతో మరణించిన వైనం తెలిసిందే.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుల బైక్ ఆధారంగా వారిని ట్రేస్ చేశారు. ఈ ఇద్దరు యువకులు సంగారెడ్డికి చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దరూ అక్కడి బార్ లో పని చేస్తుంటారని తేల్చారు. అర్థరాత్రి వరకు బార్ లో పని చేసి.. బాగా తాగేసిన వారు సంగారెడ్డి నుంచి మూసాపేట వై జంక్షన్ వరకు వచ్చారు.

ఆ సమయంలో అటు వైపు నడుచుకుంటూ వెళుతున్న బాధితురాలిపై దారుణానికి పాల్పడ్డారు. ఆమె మూసాపేటలో ఉండేదని.. ఆర్నెల్ల క్రితం వరకు ఒక వాహన షోరూంలో స్వీపర్ గా పని చేసేదని గుర్తించారు. అయితే.. ఆమె ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇద్దరు సంగారెడ్డి కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలిసింది. అసలేం జరిగిందన్న విషయాన్ని సేకరించే పనిలో వారున్నట్లు సమాచారం. త్వరలోనే వీరి అరెస్టు వివరాల్ని పోలీసులు అధికారికంగా వెల్లడించే వీలుందని తెలుస్తోంది.

Tags:    

Similar News