పహల్గాంకు రైలు... స్థానికుల నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత..!

అవును... బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ వ్యవహారం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.;

Update: 2026-01-27 09:30 GMT

గత ఏడాది పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే.. బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ జమ్మూ కాశ్మీర్‌ లో వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజానికంతో పాటు రాజకీయ నాయకులు ఈ రైల్వే లైన్ ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై నిరసనలు మొదలయ్యాయి. దీనిపై ప్రధానంగా రైతులు నిరసన తెలుపుతున్నారని అంటున్నారు!

అవును... బిజ్‌ బెహారా నుండి పహల్గాం పర్యాటక స్థలానికి ప్రతిపాదిత రైల్వే లైన్ వ్యవహారం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో... ఈ ప్రాజెక్టు తమ విస్తారమైన వ్యవసాయం, ఆపిల్ తోటల భూములను దోచుకుంటుందని.. తమ జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వీరి నిరసనల్లోకి స్థానిక రాజకీయ ప్రముఖులు చేరారు. ఈ సందర్భంగా ఈ రైల్వే లైన్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు.

ఈ సందర్భంగా... అనంత్‌ నాగ్ - పూంచ్ ఎంపీ మియాన్ అల్తాఫ్ స్థానిక నివాసితులను కలిశారు. అనంతరం మాట్లాడుతూ... స్థానిక నివాసితుల ఆపిల్ తోటలు, వ్యవసాయ భూములు ప్రతిపాదిత రైల్వే అలైన్‌ మెంట్ వెంట ఉన్నాయని.. ఈ రైల్వే లైన్ ఎవరికీ ప్రయోజనం కలిగించదని.. ఇది కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వానికి లేదా జమ్మూ & కశ్మీర్ ప్రజలకు ప్రయోజనం కలిగించదని.. ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని అన్నారు.

ఇదే సమయంలో... బిజ్‌ బెహారాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సీ) ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ స్పందిస్తూ... ఈ ప్రాజెక్టును తప్పుడు ఆలోచనతో కూడినదని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైనదని అభివర్ణించారు. ఇదే సమయంలో.. ఇటు పహల్గాంకు చెందిన ఎన్.సీ ఎమ్మెల్యే అల్తాఫ్ అహ్మద్ కలూ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తపరుస్తూ.. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రశ్నించారు. ఇప్పటికే జాతీయ రహదారి-501 మంజూరు చేయబడిందని.. రైల్వే లైన్ అవసరం లేదని అంటున్నారు!

ఈ క్రమంలోనే... పహల్గాంకు ఇప్పటికే ఒక రహదారి ఉందని.. సమాంతర రహదారిని నేషనల్ హైవే-501గా ప్రకటించారని.. ఇప్పటికే ఎన్.హెచ్-501 కోసం గణనీయమైన భాగాన్ని సేకరించారని.. ఈ పరిస్థితుల్లో మరో 40-కి.మీ. జిగ్ జాగ్ రైల్వే లైన్ అవసరం ఏమిటని ప్రశ్నించారు. త్వరలో నిర్మించనున్న హైవే ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే భూములు పెద్ద ఎత్తున తీసుకోబడ్డాయని.. ఈ సమయంలో మళ్లీ రైల్వే లైన్ కోసం భూములు ఇవ్వడం జరగదని చెబుతున్నారు!

అదేవిధంగా... ఆ ప్రాంతాన్ని సందర్శించిన పీడీపీ కార్యకర్త ఇల్టిజా ముఫ్తీ మాట్లాడుతూ... వందలాది కెనాల్‌ ల సారవంతమైన వ్యవసాయ, ఉద్యానవన భూములు, నివాస గృహాలను కలుపుతూ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం తప్పుడు ఆలోచన అని.. ఇది హానికరం అని.. ముఖ్యంగా పర్యావరణపరంగా లాభదాయకం కాదని అన్నారు. ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేయాలని ఆమె కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News