మోడీతో చప్పట్లు కొట్టించుకున్న లోకేష్.. స్పీచ్ వైరల్!

ఇక ఈ స‌భ‌లో ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణ అనేది తెలిసిన విషయమే.

Update: 2024-05-07 05:20 GMT

రాజ‌మండ్రిలో నిర్వహించిన జ‌న‌సేన‌ - బీజేపీ - టీడీపీ కూటమి ఎన్నిక‌ల ప్రచార స‌భ "ప్రజాగ‌ళం" అంగరంగ వైభవంగా అన్నట్లుగా సాగింది! అయితే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనలేకపోయినప్పటికీ... మోడీకి ఒకపక్క పవన్, మరో పక్క లోకేష్ లు కూర్చుని సభలో కళ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక ఈ స‌భ‌లో ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణ అనేది తెలిసిన విషయమే.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతున్న వేళ జరిగిన ఈ సభలో చినబాబు లోకేష్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలించిందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన ప్రసంగంలో కనిపించిన కొన్ని సరదా వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఒక సమయంలో.. ప్రధాని మోడీ సైతం చప్పట్లు కొడుతూ రియాక్ట్ అయ్యారు. దీంతో... లోకేష్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మోడీని విశ్వజిత్ అని, భారతదేశ ధైర్యం అని చెబుతూ ఆకాశానికెత్తడం వంటివి చూసి బీజేపీ నేతలు వెనుకబడిపోయారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఆ రేంజ్ లో మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు లోకేష్. ఇదే క్రమంలో... న‌మో అనే అక్షరాలు దేశాన్ని న‌డిపిస్తున్నాయ‌ని చెప్పిన నారా లోకేష్... ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోడీ అని కొనియాడారు.

ఇదే సమయంలో... మోడీకి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలంటు.. అప్పటికే స‌భా వేదిక‌పై సిద్ధం చేసిన స్వీట్లవైపు చూపించారు లోకేష్. అయితే... ప్రధాని వాటిని ముట్టుకోలేదు కానీ చేయి ఊపి రియాక్ట్ అయ్యారు. ఇక న‌మో అనే నాలుగు అక్షరాలు దేశం దశ దిశ మార్చాయని.. భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మోడీ అని.. నవభారత నిర్మాత మోడీ అని నారా లోకేష్.. అవిరామంగా కొనియాడారు!

Tags:    

Similar News