రామోజీకి కొడాలి నాని షాకింగ్ క్వశ్చన్!

ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి.. అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల ఉదంతం నేపథ్యంలో ఒక కథనం ఈనాడులో ప్రచురితమైంది.

Update: 2023-10-28 04:50 GMT

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సూటి ప్రశ్నను సంధించారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఏపీతో మీకున్న అనుంబంధం ఏమిటంటూ ప్రశ్నించటం ద్వారా కొత్త సంచలనానికి తెర తీశారు. ‘అసలు మా రాష్ట్రంతో.. మీ సొంతూళ్లతో మీకున్న సంబంధం ఏమిటి?’ అంటూ క్వశ్చన్ వేశారు. ఇంతకీ ఈ ప్రశ్నను కొడాలి నాని ఎందుకు సంధించారు? దీని బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంలోకి వెళితే..

ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి.. అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల ఉదంతం నేపథ్యంలో ఒక కథనం ఈనాడులో ప్రచురితమైంది. ఏపీలో ఉపాధి అవకాశాలు ఉంటే.. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నను సంధిస్తూ కథనం సాగింది. దీనిపై కొడాలి నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కర్ణాటకలో కార్మికులు మరణించిన విషాద ఉదంతంపై ముఖ్యమంత్రి స్పందించి.. ఏ సీఎం ఇవ్వనంత నష్టపరిహారాన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఈ రీతిలో తప్పు పడతారా?అని ప్రశ్నించారు.

మానవతాసాయం విషయంలో ఏ మాత్రం వెనుకాడని నాయకుడి మీద.. తనవాడు కాదని.. గిట్టనివాడు కాబట్టి రాళ్లు వేయటం కరెక్టా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. మిగిలిన రాష్ట్రాలకు వెళ్లటం ఘోరం.. నేరం అంటున్నప్పుడు తానో ప్రశ్నను వేస్తానంటూ సంచలనానికి తెర తీశారు. ‘అసలు మా రాష్ట్రంతో.. మీ సొంతూళ్లతో మీకున్న సంబంధం ఏమిటి? చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప.. రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది? చంద్రబాబుకు అయినా.. పవన్ కల్యాణ్ కు అయినా సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుంది? పవన్ కల్యాణ్ తమ్ముడిలా రోజూ మీ ఈనాడు పేపర్ లో జగన్ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోదించి ఆనందం పొందుతున్నారు’ అంటూ ఘాటుగా దుయ్యబట్టారు. రామోజీకి కొడాలి వేసిన ప్రశ్న ఇప్పుడు చర్చకు తెర తీసింది.

Tags:    

Similar News