ఎంతపని చేశావు కంగనా... సొంత పార్టీనేతపైనే...!!

దేశవ్యాప్తంగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సందడి నడుస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-05-06 04:29 GMT

దేశవ్యాప్తంగా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సందడి నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... నేతలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్థులపై విరుచుకుపడిపోతున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో పొరపాటున సొంతపార్టీనేతపైనే విమర్శలు గుప్పించేశారు!

అవును.. బాలీవుడ్‌ లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా రనౌత్... తాజా పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ గందరగోళానికి గురయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కంగనా రనౌత్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... అవినీతిపరుల పార్టీ ఇక్కడ ఉంది.. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్ గాంధీ.. రౌడీయిజం చేసి, చేపలు తినే తేజస్వీ సూర్య ఆ పార్టీలో ఉన్నారు అని ఆమె విమర్శించారు.

అయితే... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కు బదులు ఆమె బీజేపీ నేత తేజస్వీ సూర్య (కర్ణాటకకు చెందిన ఎంపీ అభ్యర్థి) పేరును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీ నేతను విమర్శించే క్రమంలో... ఇలా సొంతపార్టీ నేత పేరు పొరపాటున పలికి ఫైరయ్యారు. దీంతో... ప్రత్యర్థులు కంగనానాన్ను ఆన్ లైన్ వేదికగా ఒక ఆటాడేసుకుంటున్న పరిస్థితి!

ఇందులో భాగంగా... కంగనా రనౌత్‌ మాట్లాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. ఈ సందర్భంగా దీనిపై స్పందిస్తూ... "ఆమె ఎవరు?" అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో... ఎంపీగా పోటీ చేసేందుకు ఆమెకు ఉన్న అర్హతలేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News