పింఛన్పై చంద్రబాబు దృష్టి.. కొత్త కొత్తగా మరో డెసిషన్ ..!
అప్పటి వరకు ఇచ్చిన రూ.3000 పింఛనును తాము అధికారంలోకి వస్తే.. రూ.1000 పెంచి రూ.4000 చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.;

గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు .. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక భద్రతా పింఛను వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఇచ్చిన రూ.3000 పింఛనును తాము అధికారంలోకి వస్తే.. రూ.1000 పెంచి రూ.4000 చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది బాగా వర్కవుట్ అయింది. పైగా.. గ్రామీణ ఓటు బ్యాంకును బాగా కదిలించింది.
దీంతో క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంకు పెరగడంతోపాటు... తొలిసారి 134 నియోజకవర్గాల్లో టీడీపీ విజ యం దక్కించుకుంది. దీనికి మెజారిటీ కారణం.. పింఛను పెంచడమేనని పార్టీ నాయకత్వం గుర్తించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మరింత ఎక్కువగా పింఛన్పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలిసింది. కొత్తగా వేలాదిమందికి పింఛను ఇవ్వడ ద్వారా.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రాచబాట వేసుకునే క్రమంలో అడుగులు పడుతున్నాయి.
మరీ ముఖ్యంగా వయోవృద్ధులుగా ఉన్న భార్యా భర్తలకు ఇప్పటి వరకు ఎవరో ఒకరికి మాత్రమే పింఛను అందుతోంది. అంటే.. ఒకే ఇంట్లో భార్య భర్తా ఇద్దరూ వృద్ధాప్య పింఛనుకు అర్హులైతే.. వారిలో ఒక్కరికి మాత్రమే సామాజిక భద్రతా పింఛను అందిస్తున్నారు. ఇక, ఇప్పుడు అలా కాకుండా.. ఇద్దరికీ పింఛను ఇవ్వాలన్నది సర్కారు ఆలోచన. అంతేకాదు.. వచ్చే నెల నుంచే దీనిని ప్రారంభించనున్నారు. తద్వారా.. కొత్తగా 89,788 మందికి రూ.4 వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు.
దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలను చంద్రబాబు ఆశిస్తున్నారు. 1) వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉందన్న సంకేతాలతోపాటు.. వృద్ధుల ఓట్లను గుండుగుత్తగా టీడీపీకి పడేలా చేసుకోవడం. 2) కుటుంబ సభ్యులపై వృద్ధుల భారం తగ్గుతుంది. తద్వారా కుటుంబాలకు కూడా ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతుంది. ఇది కూడా తమకు మేలు చేస్తుందని సీఎం భావిస్తున్నారు. సో.. ఈ రెండు రూపాల్లోనూ.. చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
ఇక, రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి ఈ నెలలోనూ ఒకరోజు ముందుగానే ఇవ్వనున్నారు. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న పింఛన్ డబ్బులు అందజేస్తారు. ఇది కూడా సర్కారుకు మేలు చేస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఎలా చూసుకున్నా.. ప్రభుత్వంపై అసంతృప్తి పెరగకుండా.. ఉన్న అన్ని మార్గాలనూ చంద్రబాబు వినియోగించుకుంటున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.