విక్ట‌రీ వెంక‌టేష్ కోసం గ్లోబ‌ల్ స్టార్ సాధ్య‌మేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ భారీ సోషియో ఫాంట‌సీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు.;

Update: 2025-05-17 13:45 GMT
Trivikram Plans Multistarrer with Venkatesh and Ram Charan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఓ భారీ సోషియో ఫాంట‌సీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. దీనికి చాలా టైమ్ ప‌డుతుంద‌నే వార్త‌లు వినిపించాయి. ఇదే స‌మ‌యంలో `పుష్ప 2`తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకున్న అల్లు అర్జున్ ఆ క్రేజ్‌ని మ‌రింత హైట్స్ తీసుకెళ్లాల‌నే ప్లాన్‌తో త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు రెడి కావ‌డం తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై దీన్ని క‌ళానిధి మార‌న్ నిర్మించ‌బోతున్నారు. దీని త‌రువాతే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌కు బ‌న్నీ డేట్స్ కేటాయించ‌నున్నాడు.

దీంతో త్రివిక్ర‌మ్ ఆ టైమ్‌ని కాస్త వెంక‌టేష్‌తో ప్రాజెక్ట్ చేయ‌డానికి వినియోగించుకోబోతున్నాడు. త్రివిక్ర‌మ్ మార్కు ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌పైకి రానున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి తాజాగా నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇది వెంకీ సోలో ఫిల్మ్ కాద‌ని దీన్ని భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా త్రివిక్ర‌మ్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. అంతే కాకుండా ఇందులో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టించ‌నున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు వ‌చ్చే వారం రామ్ చ‌ర‌ణ్‌తో త్రివిక్ర‌మ్ జ‌ర‌ప‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. గ‌త కొంత కాలంగా రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావించారు కానీ అది ఇంత వ‌ర‌కు మెటీరిలైజ్ కాలేదు. దీంతో వెంకీ ప్రాజెక్ట్‌లోకి చ‌ర‌ణ్‌ని తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ అనుకున్నాడు కానీ అది ఇప్ప‌టికి కుద‌ర‌లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆ వెలితిని తీర్చుకోవాల‌నే వెంకీ తో చేయ‌బోతున్న ప్రాజెక్ట్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను కూడా భాగం చేయాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌.

అయితే త్రివిక్ర‌మ్ చెప్పే క‌థ చ‌ర‌ణ్‌కు న‌చ్చితేనే ఇది మెటీరియ‌లైజ్ అవుతుంది. చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. క‌థ క‌న్విన్స్ చేయ‌క‌పోతే త‌ను ఈ ప్రాజెక్ట్ చేయ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చిట్టిబాబు సాన డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `పెద్ది`లో న‌టిస్తుఎన్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చ‌ర‌ణ్‌ని త్రివిక్ర‌మ్ స్టోరీతో ఒప్పిస్తే మాత్రం డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డం ఖాయం. అదే జ‌రిగితే మ‌రో బారీ మ‌ల్టీస్టార‌ర్‌కు తెర‌లేచిన‌ట్టే. ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి బ‌రిలోకి దించాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ స‌మ్మ‌ర్‌కు వెళుతుంది. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు

Tags:    

Similar News