ఆ హీరోతో త్రివిక్ర‌మ్ సినిమా ఆగిపోలేదు

గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన గుంటూరు కారం సినిమా త‌ర్వాతి నుంచి డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఖాళీగానే ఉన్నాడు.;

Update: 2025-06-12 09:00 GMT
ఆ హీరోతో త్రివిక్ర‌మ్ సినిమా ఆగిపోలేదు

గ‌తేడాది సంక్రాంతికి వ‌చ్చిన గుంటూరు కారం సినిమా త‌ర్వాతి నుంచి డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఖాళీగానే ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప‌2 అయ్యాక సినిమా చేద్దామ‌ని దానిపైనే క‌స‌రత్తులు చేసి దాని కోసం ఎంతో టైమ్ ను కేటాయించాడు. కానీ బ‌న్నీ మాత్రం పుష్ప‌2 రిలీజ‌య్యాక త్రివిక్ర‌మ్ తో కాకుండా అట్లీతో సినిమాను అనౌన్స్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డంలో బిజీ అవ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు.

దీంతో చేసేదేమీ లేక బ‌న్నీతో చేద్దామ‌నుకున్న ప్రాజెక్టునే త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో ముందుకు తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా నిర్మాత నాగ‌వంశీ త‌న సోష‌ల్ మీడియాలో ఓ హింట్ ఇస్తూ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్టు త్రివిక్ర‌మ్ తోనే అని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్ర‌మ్ రామ్ చ‌ర‌ణ్ తో మూవీ చేయ‌నున్నాడ‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు ఫిక్స్ అవ‌డంతో ఇక రామ్ చ‌ర‌ణ్ తో త్రివిక్ర‌మ్ సినిమా ఉండ‌ద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఈ విష‌యంలో ఇప్పుడో కొత్త వార్త వినిపిస్తుంది. త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను, రామ్ చ‌ర‌ణ్ తో ఓ సినిమాను లైన్ లో పెట్టాడ‌ని, ఈ ఇద్ద‌రి టాలీవుడ్ స్టార్ల‌తో త్రివిక్ర‌మ్ సినిమాలు చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

రామ్ చ‌ర‌ణ్ తో త్రివిక్ర‌మ్ చేయ‌బోయే ప్రాజెక్టు ఆగిపోయింద‌నేది అబ‌ద్ధ‌మ‌ని, ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పెద్ది సినిమా పూర్త‌వ‌గానే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. కాగా ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో చేయ‌బోయే ప్రాజెక్టుపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News