సాయి ధరమ్ తేజ్ ను అనుమానించిన పవన్

ఈ సీన్ లో మామయ్య ముందు మందు తాగడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది.

Update: 2023-07-24 06:02 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రో. జూలై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్రో సినిమాని నిర్మించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అవుట్ అండ్ డౌట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే సముద్రఖని ట్రైలర్ ని కట్ చేశారు.

ఇది కేవలం పవర్ స్టార్ అభిమానులకు మాత్రమే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూడగలిగే చిత్రంగా బ్రో మూవీ ఉండబోతుందని ఈ ట్రైలర్ తోనే కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ ఆక్టివిటీస్ లో సాయి ధరమ్ తేజ్ బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇందులో బ్రో సినిమా షూటింగ్ టైంలో తనకి పవన్ కళ్యాణ్ మామయ్యతో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ సంభాషణని బయటపెట్టారు.

షూటింగ్ లో తాను బాగా ఇబ్బంది పడిన సీన్ పవన్ కళ్యాణ్ ముందు మందు తాగేది అని చెప్పారు. ఈ సీన్ లో మామయ్య ముందు మందు తాగడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. అయితే సీన్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది.

అది కంప్లీట్ అయిన తర్వాత పవన్ తన దగ్గరకు వచ్చి మందు తాగి సెట్ కి వచ్చావా అని అడిగారు. లేదని చెప్పాను. ఏదో బాగా అనుభవం ఉన్నవాడిలా నటిస్తే డౌట్ వచ్చింది అంటూ తనని కాస్తా ఆటపట్టించ్చారు.

Read more!

అయితే మా ఇద్దరి మధ్య జరుగుతున్న ఆ సరదా సన్నివేశాన్ని మాకు తెలియకుండా సముద్రఖని షూట్ చేసి సినిమాలో పెట్టేసారు. ఇలా ఇబ్బంది పడిన సందర్భాలు రెండు, మూడు ఉంటాయని, అలాగే క్యాజువల్ గా పవన్, మామయ్యతో జరిగిన సంభాషణని షూట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయని తేజ్ చెప్పడం విశేషం.

దేవుడి పాత్రని బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ చేశారని, అయితే ఆయన బీడీలు ఎందుకు పట్టుకున్నారు, లుంగీ ఎందుకు కట్టుకున్నారు లాంటి లాజిక్ లు ఆడకుండా మూవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలని తేజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . కచ్చితంగా ఈ చిత్రంలో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

Tags:    

Similar News