రత్నం గారి కష్టాలు కొంతైనా తీరినట్టేనా...?

తమిళ స్టార్‌ హీరోలతో పాటు తెలుగు లో ఎంతో మంది స్టార్‌ హీరోలతో పలు సూపర్ హిట్‌ సినిమాలను నిర్మించిన అరవ నిర్మాత ఎఎం రత్నం

Update: 2024-05-02 04:43 GMT

తమిళ స్టార్‌ హీరోలతో పాటు తెలుగు లో ఎంతో మంది స్టార్‌ హీరోలతో పలు సూపర్ హిట్‌ సినిమాలను నిర్మించిన అరవ నిర్మాత ఎఎం రత్నం. పవన్‌ కళ్యాణ్ ఖుషి సినిమాతో పాటు తెలుగు లో ఎన్నో సినిమాలను నిర్మించిన సూర్య మూవీస్ బేనర్‌ ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. తమిళనాట కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు.

ఆర్థిక సమస్యల కారణంగానే ఎఎం రత్నం సినిమాలు చేయడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన మళ్లీ సినిమా నిర్మాణంలో బిజీ అయ్యేందుకు పవన్‌ కళ్యాణ్‌ తో హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టాడు. భారీగా ఖర్చు చేసిన రత్నం కు పవన్‌ షాక్‌ ఇచ్చాడు. ఎన్నికల ముందు వీరమల్లు షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కాలేదు.

రెండేళ్లకు పైగా హరిహర వీరమల్లు సినిమాకు సమయం పట్టింది. ఈ ఏడాది విడుదల ఉంటుందో లేదో క్లారిటీ లేదు. దాంతో రత్నం గారి ఆర్థిక కష్టాలు మరింతగా పెరగడం ఖాయం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎఎం రత్నం కు అనుకోని అదృష్టం అన్నట్లుగా పాతిక కోట్ల రూపాయలు కలిసి వచ్చాయి.

ఇరవై ఏళ్ల క్రితం తన బ్యానర్‌ లో రూపొందిన విజయ్ 'గిల్లీ' సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేయడం జరిగింది. రీ రిలీజ్ లో మరే సినిమా సాధించని వసూళ్లను గిల్లీ సాధించింది అంటూ తమిళ మీడియా కోడై కూస్తోంది. తమిళనాట గిల్లీ సినిమా దాదాపు వారం పది రోజుల పాటు సందడి చేసింది.

Read more!

రీ రిలీజ్ లో గిల్లీ సినిమా ఏకంగా రూ.25 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అనేది తమిళ బాక్సాఫీస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదే నిజం అయితే ఎఎం రత్నం గారి ఆర్థిక కష్టాలు కొంతలో కొంత అయినా తీరినట్లే కదా అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రూపాయి ఖర్చు పెట్టకుండానే పాతిక కోట్ల రూపాయల ఆధాయం ఈ ఏడాది వచ్చింది అంటే కచ్చితంగా ఆయనకు ఈ ఏడాది కలిసి వచ్చిందని చెప్పాలి. అందుకే హరి హర వీరమల్లు సినిమాను కూడా ఈ ఏడాది విడుదల చేస్తే రత్నం గారికి మరింత కలిసి వస్తుందేమో అంటున్నారు.

Tags:    

Similar News