పొంగల్ కాదు సమ్మర్ కి షిఫ్ట్..?
ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ హీరోగా తారక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.;
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ హీరోగా తారక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్ 2 సినిమా పూర్తి చేయడంతో పాటుగా నీల్ సినిమా షూటింగ్ కి కూడా సన్నద్ధం అయ్యాడు ఎన్టీఆర్. మైత్రి నిర్మాతలు నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ హైప్ ఎక్కిస్తున్నారు.
త్వరలో ఎన్టీఆర్ నీల్ మరో యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు పెడతారని టాక్. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ముందే 2026 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మే వచ్చేసింది ఇప్పటివరకు నీల్ ఎన్టీఆర్ సినిమా ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి అయ్యింది. మరి మిగతా 7 నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడం కుదరని పని. అందుకే సినిమా సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ సినిమాలు ఓపెనింగ్ టైమ్ లో ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. కానీ షూటింగ్ అనుకున్న టైమ్ కి పూర్తి అవ్వక అనుకోని అవంతరాలు ఎదురై అనుకున్న డేట్ వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. స్టార్ సినిమా వస్తుంది కదా అని మిగతా సినిమాలు ఏవి ఆ డేట్ కి వచ్చే డేర్ చేయలేరు.
అయితే 2026 సంక్రాంతి కి ఎన్టీఆర్ నీల్ సినిమా వచ్చినా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాతో ఢీ కొట్టే ఛాన్స్ ఉండేది. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ చేస్తున్నట్టు టాక్. అలా అయితే మే లోనే ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మైత్రి వాళ్లదే రామ్ చరణ్ పెద్ది సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ మార్చి ఎండింగ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. సో మార్చి లో చరణ్ పెద్ది వస్తే ఎన్టీఆర్ నీల్ సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని టాక్. సో ఎన్టీఆర్ తో నీల్ చేసే మాస్ రచ్చ ఏవిధంగా ఉంటుందో చూడాలి.