ప‌వ‌న్ మిష‌న్ కి న‌రేష్ మ‌ద్ద‌తు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప‌రిశ్ర‌మ నుంచి కొంత మంది మ‌ద్ద‌తు ప‌లుకుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-08 10:42 GMT

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప‌రిశ్ర‌మ నుంచి కొంత మంది మ‌ద్ద‌తు ప‌లుకుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌బ‌ర్దస్త్ క‌మెడియ‌న్లు..టీవీ ఆర్టిస్టులు కొంద‌రు ఆయ‌న త‌రుపున పిఠాపురంలో ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్ మ‌న‌సున్న మంచి వ్య‌క్తి ఆని...ఆయ‌న గెలిస్తే మ‌రింత అభివృద్దిలోకి పిఠాపురం వ‌స్తుంద‌ని హామీలీతో దూసుకు పోతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చే దిశంగా అంతా త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

గ‌తంలో గాజువాక‌..భీమ‌వ‌రంలో ఓడిపోవ‌డంతో ఈసారి ప్ర‌త్య‌ర్ధుల‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మొత్తం పిఠాపురంలో దిగిపోయిన సంగ‌తి తెలిసిందే. మేన‌ల్లుళ్లు సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్...నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ్..ఆయ‌న భార్య ప‌ద్మజ త‌దిత‌రులు ఇప్ప‌టికే ప్ర‌చారం చేసి వెళ్లారు. రేపోమాపో మెగాస్టార్ చిరంజీవి కూడా నేరుగా వ‌చ్చి ప్ర‌చారం చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ ని గెలిపించాల‌ని పిఠాపురం ప్ర‌జానీకాన్ని చిరు కోరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కూడా జ‌న‌సేన‌కు త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. `ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిర‌మైన మ‌ద్ద‌తు దారునిగా కొన‌సాగుతున్నా. మీ ప్ర‌యాణం మీ అశాద్వీపం. మీ మిష‌న్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తాం. మీరంతా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్` అని అన్నారు.

Read more!

కొన్ని రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై న‌రేష్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ని ఉద్దేశించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా న‌రేష్ అలా మాట్లాడాలి ఉండాల్సింది కాద‌ని..ఆ వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌తంగా త‌న‌ని ఎంతో బాధించాయ‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. కానీ వాటితో సంబంధం లేకుండా నరేష్ త‌న మ‌ద్ద‌తు జ‌న‌సేన‌కేన‌ని ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సైనికులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News