స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డం మ‌హేష్ కే చెల్లిందా!

స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డం అన్న‌ది సూప‌ర్ స్టార్ మ‌హేష్ కే చెల్లిందా? అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక‌తే వేరా? అంటే అవున‌నే అనాలి.;

Update: 2025-05-27 11:30 GMT
స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డం మ‌హేష్ కే చెల్లిందా!

స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డం అన్న‌ది సూప‌ర్ స్టార్ మ‌హేష్ కే చెల్లిందా? అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక‌తే వేరా? అంటే అవున‌నే అనాలి. రాజ‌మౌళి పాన్ ఇండియా స‌క్సెస్ లు అందుకున్న త‌ర్వాత మ‌హేష్ అత‌డితో ఎప్పుడు ప‌నిచేస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూసారు. కానీ ఆ ఛాన్స్ రాజ‌మౌళి రెండు స‌క్సెస్ లు అందుకునే వ‌ర‌కూ గానీ తీసుకోలేదు. ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తారనే ప్ర‌చారం జ‌రిగిందిగానీ క‌లిస్తే గ్లోబ‌ల్ స్థాయిలో రంగంలోకి దిగుతార‌న్న‌ది ఎవ్వ‌రూ ఊహించ‌నిది.

ఎస్ ఎస్ ఎంబీ 29తో ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ నే టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ లాంటి స్టార్లు త‌దుప‌రి ఫ‌లానా డైరెక్ట‌ర్ తో ప‌నిచేస్తార‌ని ఓ సినిమా సెట్స్ లో ఉండ‌గానే క్లారిటీ వ‌స్తుంది. కానీ మ‌హేష్ విష‌యంలో మాత్రం ఆ క్లారిటీ రావ‌డం లేదు. 'గేమ్ ఛేంజ‌ర్' సెట్స్ లో ఉండ‌గానే చ‌ర‌ణ్ లైన‌ప్ లీకైంది. బుచ్చిబాబుతో ఆర్సీ 16, సుకుమార్ తో ఆర్సీ 17 ఉంటాయ‌ని హింట్ ఇచ్చేసారు.

అన్న‌ట్లుగానే ప‌ట్టాలెక్కించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా 'దేవ‌ర' చేస్తోన్న స‌మ‌యంలో ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ తెర‌పైకి వ‌చ్చింది. కంటున్యూటీగా `దేవ‌ర 2` ఉంటుంద‌ని ప్ర‌చారం సాగిందిగానీ తార‌క్ పార్ట్ 2 తాత్క‌లికంగా బ్రేకులు వేసి 'డ్రాగ‌న్' ప‌ట్టాలెక్కించారు. ఈ సినిమా త‌ర్వాత 'దేవ‌ర 2' మొద‌ల‌వుతుంది. ఇక డార్లింగ్ ప్ర‌భాస్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌డం అన్న‌ది జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం `రాజాసాబ్`, `పౌజీ`ల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండిటి త‌ర్వాత `స్పిరిట్` మొద‌ల‌వుతుంది. అటుపై `క‌ల్కి 2` ప‌ట్టాలెక్కుతుంది. ఈ లోగా మ‌రిన్ని ప్రాజెక్ట్ లు క‌న్ప‌మ్ అవుతాయి. కానీ మ‌హేష్ మాత్రం ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాడు? అన్న‌ది ఊహ‌కి కూడా అంద‌డం లేదు. అత‌డి రేసులో ఏ డైరెక్ట‌ర్ పేరు కూడా వినిపించ‌డం లేదు. ఇలా సీక్రెట్ కం స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డం అన్న‌ది మ‌హేష్ కే చెల్లింది.

Tags:    

Similar News