మహేష్ - రాజమౌళి: నెక్స్ట్ ఏంటీ?

SSMB29 - ఈ సినిమాను రాజమౌళి వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు. షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి హైప్ లేకుండా, నిశ్శబ్దంగా సినిమా పనులను పూర్తి చేస్తున్నారు.;

Update: 2025-06-18 06:44 GMT
మహేష్ - రాజమౌళి: నెక్స్ట్ ఏంటీ?

SSMB29 - ఈ సినిమాను రాజమౌళి వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు. షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి హైప్ లేకుండా, నిశ్శబ్దంగా సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. ఓ వైపు ప్రపంచ స్థాయిలో ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్‌గా రూపొందుతోంది అన్న టాక్ వినిపిస్తుండగా, మరోవైపు చిత్రబృందం ఒక్క అప్డేట్ బయటికి రాలేదన్నదే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే దీనికీ కారణం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రామాణికతను నిలబెట్టేలా రూపొందించాలనే టార్గెట్‌తో రాజమౌళి ముందుకెళ్తున్నాడు. షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా హైలెట్ చేయాలనే ప్రణాళికలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే వేసవిలో బ్రేక్ తీసుకున్న యూనిట్, మళ్లీ హైదరాబాద్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు. ఇక జూలైలో కెన్యాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు నెలరోజుల పాటు షెడ్యూల్ ఉండబోతున్నదట. ఇప్పటికే కెన్యాలోని అడవుల్లో లొకేషన్లను పరిశీలించిన రాజమౌళి, కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం అక్కడి యాక్షన్ కోర్ టీంను కూడా ఎంపిక చేశారట. దీంతో ఈ షెడ్యూల్‌కి యూనిట్ చాలా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. అయితే వీరిలో ఎవరి పాత్ర ఎలా ఉంటుందనే విషయమై ఇంకా స్పష్టత లేదు.

ప్రత్యేకంగా ప్రియాంక చోప్రా పాత్ర మీద కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కొంతమంది ఆమెది నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అని, మరికొంతమంది ఇంపార్టెంట్ లీడ్ అని టాక్. ఇక మహేష్ బాబు విషయానికొస్తే, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన పూర్తిగా తన టైమ్ కేటాయిస్తున్నాడు. ఇటీవల మరోసారి తన పాస్ పోర్ట్‌ను రాజమౌళికి 'సరెండర్' చేశాడన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అసలు ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచే మహేష్ బాబు ఇతర పనులకు దూరంగా ఉండటం గమనార్హం. విహార యాత్రలు ఎక్కువగా చేసే మహేష్ కు ఈ సినిమా ద్వారా ఆ ఛాన్స్ లేకుండా పోయింది. సినిమాకి తన పూర్తి కమిట్‌మెంట్ చూపిస్తున్నాడు. అందరినీ ఆశ్చర్యపరిచేలా, ఈ సినిమా కేవలం ఇండియన్ స్టాండర్డ్స్‌తో కాకుండా, హాలీవుడ్ స్థాయిలో కనిపించాలనే లక్ష్యంతో తెరకెక్కుతోంది.

అందుకే ఒక్కసారి షూటింగ్ మొదలైతే ఏ ఒక్క మీడియా అప్‌డేట్‌కి కూడా చోటు ఇవ్వకుండా, రాజమౌళి తన స్టైల్‌ని మార్చాడు. ఇది మహేష్ కెరీర్‌లోనే కాకుండా, రాజమౌళి కెరీర్‌లోను టర్నింగ్ ప్రాజెక్ట్ కావడం వల్లే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. ఇప్పుడు కెన్యా షెడ్యూల్ పూర్తయిన తరువాత మొదటి మేజర్ లుక్, లేదా గ్లింప్స్ వదలే అవకాశముంది.

Tags:    

Similar News