సందీప్ కు ముంబైలో ఫ్లాట్ సెట్ చేశారట!

Update: 2019-06-11 18:20 GMT
'అర్జున్ రెడ్డి' చిత్రంతో సంచలనం సృష్టించిన సందీప్ వంగా ప్రస్తుతం అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్ ను ఈమధ్యే పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 21 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.  ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో దర్శకుడు సందీప్ బిజీగా ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ముంబై ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిందని తెలిపాడు.

ఈ బాలీవుడ్ రీమేక్ కోసం దాదాపు ఏడాది పాటు పని చేయాల్సి వచ్చిందట.  సందీప్ మన తెలుగువాడు..  హైదరాబాద్ వాసి కదా. దీంతో ముంబైకి హైదరాబాద్ కు అటూ ఇటూ ప్రయాణాలు చేయకతప్పదు.  కానీ సందీప్ మనసుకు ఈ సినిమా చాలా దగ్గరైనది.  ఇలా ప్రయాణాలు చేస్తూ ఉంటే తన ఫోకస్ తగ్గుతుందని భావించి షూటింగ్ జరిగినన్ని రోజులు ముంబైకి మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడట.  దీంతో 'కబీర్ సింగ్' నిర్మాతలు సందీప్ కోసం వెస్ట్ ముంబై లో ఒక ఫ్లాట్ ను రెడీ చేసి ఇచ్చారట.  ఈ ఏడాది కాలం దాదాపుగా సందీప్ అక్కడే నివసించాడట.  ఈ ఏడాది కాలంలో ముంబైలో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని సందీప్ తెలిపాడు.

షాహిద్ కపూర్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అర్జన్ బజ్వా.. సురేష్ ఒబెరాయ్.. నికితా దత్తా ఇతర కీలక పాత్రలు పోషించారు. సినీ 1 స్టూడియోస్.. టీ సీరీస్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News