క్లిక్‌ క్లిక్‌ : ముద్దుగుమ్మల అందాల ప్రదర్శన

Update: 2020-01-23 11:31 GMT
సౌత్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమద్య కాలంలో బాలీవుడ్‌ వైపు చూస్తుంది. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడికి ఈమద్య అస్సలు టైం బాగాలేదు. ఆ కారణంగానే ఈమె బాలీవుడ్‌ లో ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే ఎక్కువగా బాలీవుడ్‌ మీడియాలో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ముంబయి బాంద్రా లో ఉండే ప్రముఖ ఫార్మర్స్‌ కేఫ్‌ కు తాజాగా ఈ అమ్మడు వెళ్లింది. అక్కడ నుండి బయటకు వస్తున్న సమయంలో ఈమెకు రియా చక్రవర్తి తారసపడింది.

ఆ సందర్బంగా ఇద్దరు కూడా కౌగిలించుకుని ఒకరిని ఒకరు విష్‌ చేసుకున్నారు. రియా చక్రవర్తి సౌత్‌ తో పాటు నార్త్‌ లో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. వీరిద్దరు కూడా బాలీవుడ్‌ లో బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరు తారస పడటం ఒకరిని ఒకరు హగ్‌ చేసుకుని ముద్దు పెట్టుకోవడం అక్కడున్న బాలీవుడ్‌ మీడియా దృష్టి లో పడింది. ఆ ఫొటోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలపై మీరు ఒక లుక్కేయండి.
Tags:    

Similar News