శర్వా పెళ్లి సౌండ్ షురూ

Update: 2023-06-02 11:51 GMT
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. ఆయన పెళ్లి  జూన్ 3వ తేదీన కాగా, పెళ్లి వేడుక అప్పుడే ప్రారంభమైంది. వధూవరులతో సహా, వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. వీరి వివాహం జరగనున్న జైపూర్ లీలా ప్యాలెస్ ను అద్భుతంగా డెకరేట్ చేశారు.

వీరి వివాహం రెండు రోజులపాటు జరగనుంది. వీరి పెళ్లి కి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కొద్ది రోజుల క్రిందట శర్వా తన పెళ్లి పత్రికల ను ముఖ్యమైన వారికి స్వయంగా ఆయనే పంచిపెట్టడం విశేషం.

కాగా, ఇప్పటికే మెహందీ ఫంక్షన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హల్దీ వేడుక, సంగీత్ వేడుక జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 3 వ తేదీన రాత్రి 11 నుండి పెళ్లి  ప్రారంభమవుతుంది. కాగా, ఈ ఏడాది జనవరి లో శర్వానంద్ నిశ్చితార్థం రక్షిత రెడ్డి తో జరిగింది. చాలా గ్రాండ్ గా ఈ కార్యక్రమం నిర్వహించగా, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, అదితి రావ్ హైదరీ, అఖిల్ అక్కినేని, సిద్ధార్థ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీరి పెళ్లి ఆగిపోయినట్లు కూడా వార్తలు రాగా, వాటి ని ఆయన టీమ్ ఖండించారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, తనకు ఏమీ కాలేదని క్షేమంగా ఉన్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు.  ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్, ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చాడు శర్వానంద్.
 
ఇదిలా ఉండగా, శర్వానంద్ ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. రక్షిత రెడ్డి అమెరికా కు చెందిన టెక్కీ. ఆమెది ఏపీ లో ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ. వధువు తండ్రి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో న్యాయవాది కాగా.. తాత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి పొలిటిషియన్ కావడం విశేషం.

Similar News