ధనుష్ కు నాగ్ ఓపెన్ ఆఫర్
తమిళ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కుబేర. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.;

తమిళ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కుబేర. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. జూన్ 20న కుబేర పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం చెన్నైలో ఆడియో లాంచ్ ను ఏర్పాటు చేశారు.
కుబేర ఆడియో లాంచ్ లో శేఖర్ కమ్ముల సినిమా గురించి, ధనుష్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కుబేర అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ధనుష్ తప్ప ఈ క్యారెక్టర్ ను ఎవరూ చేయరు, చేయలేరని ఆయన పేర్కొన్నారు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు అందుకుంటారని ఆయన తెలిపారు.
ఈ ఆడియో లాంచ్ కు హాజరైన నాగార్జునకు తమిళ ఆడియన్స్ ఎంతో ఘనంగా వెల్కమ్ చెప్పారు. ధనుష్ ఒక రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ యాక్టర్ అని, అతనిలో ఎంతో టాలెంట్ ఉందని చెప్పారు. ధనుష నువ్వు నన్ను ఎప్పుడు డైరెక్ట్ చేస్తావని నాగార్జున ఈ సందర్భంగా ధనుష్ ను అడిగారు. కుబేర సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో గూస్బంప్స్ తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయన్నారు.
సినిమాలో ధనుష్ యాక్టింగ్ చూసి చాలా షాకయ్యానని చెప్పిన కింగ్, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కుబేర లాంటి సినిమాకు వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని రష్మిక చెప్తే, ఇలాంటి సినిమాకు సంగీతం అందించినందుకు ఆనందంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మొదటిసారిగా నాగార్జున, ధనుష్ కలిసి నటిస్తుండటంతో అందరికీ మంచి అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను కుబేర ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.