గ్లిజరిన్ లేకుండా ఒకే కంటి నుంచి నీళ్లు కార్చిన నటి
ఏడుపొస్తే లేదా భావోద్వేగానికి గురైతే కన్నీళ్లు బొటబొటా కారతాయి. ఆడాళ్ల కళ్లలో నీటి కుండ దాగి ఉంటుంది. అయితే అంతటి ప్రతిభావనుల్ని ఒంటి కన్నుతో నీళ్లు కార్చాలి! అని కండీషన్ పెడితే..? అలా చేసి చూపించగలరా? .. ఎందరికి సాధ్యం?
గొప్ప కథానాయికలకే సాధ్యం కానిది. కానీ ఆ యువనటి ఆరంగేట్రమే అలాంటి సాహసానికి పూనుకుంది. ఒంటి కన్ను నుంచి కన్నీళ్లు పెట్టుకుని దర్శకదిగ్గజాలచే శహభాష్ అనిపించుకుంది. అలాంటి అరుదైన నట ప్రతిభ తన సొంతం కాబట్టే సావిత్రి మహానటి అయ్యారు. క్లాసిక్ డేస్ సంచలనంగా దశాబ్ధాల పాటు ఇండస్ట్రీని ఏలారు. ఇక సావిత్రి మల్టీట్యాలెంట్ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది.
దిగ్గజ నటి సావిత్రి గురించి ప్రస్తావించకుండా ఎన్.టి.రామారావు అక్కినేని నాగేశ్వర రావు లేదా శివాజీ గణేషన్ గురించి మాట్లాడలేం. ఆమె గుంటూరు జిల్లాలో జన్మించారు. బాల నటిగా రంగస్థలంపై ప్రవేశించి.. జీవితంలో కేవలం సినిమా కంటే చాలా ఎక్కువ ఉంది అని నిరూపించారు. నటిగా గాయనిగా నిర్మాతగా రేస్ కార్ డ్రైవర్ గా ఆల్ రౌండర్ ప్రతిభను చాటుకున్నారు. తన స్వల్ప జీవిత కాలంలోనే తెలుగు -తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నట ప్రతిభతోనే కాదు.. ప్రజలకు సహాయపడే సేవాగుణం మంచితనంతో గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్నారు.
సహజనటిగా మహానటిగా తన కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు సావిత్రి. దేవదాస్- మిస్సమ్మ- కలతూర్ కన్నమ్మ- పసల్మార్- కార్పగం- తిరువిలయదల్ చిత్రాలలో నటనకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.
సావిత్రి జీవితంపై ఏకంగా బయోపిక్ ని నిర్మించారు వైజయంతి అధినేత అశ్వనిదత్. సావిత్రి రకరకాల కారణాలతో అగ్ర కథానాయకుడు శివాజీ గణేషన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె - కుమారుడు ఉన్నారు.
సావిత్రి అంతిమ జీవితం ఎంతో సహనంతో కూడుకున్నది. ఆమె దానధర్మాలు ఔదార్యం కారణంగా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఎంత కష్టం వచ్చినా కానీ ఎప్పుడూ ఇతరుల సహాయం తీసుకోలేదు. ఆమెను దగ్గరగా ఉన్నవారే మోసం చేశారు. సహాయం చేయదలిచినా ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. కెరీర్ చివరిలో సహాయ నటిగానూ నటించిన ఏకైక మేటి నాయిక సావిత్రి. నిర్మాతగా ఎన్నో సాహసాలు చేశారు. అందుకే తనను అమ్మ అని పిలిచి గౌరవించారు కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు. పరిశ్రమ దిగ్గజాలంతా ఆమెను అమ్మ అనే గౌరవిస్తారు.
అంత గొప్ప స్టార్ ఐదు పదుల కన్నా తక్కువ సంవత్సరాలు జీవించారు. కానీ ఆమె వైభవం కీర్తి ఈ రోజు వరకు చెక్కు చెదరలేదు. రాబోయే తరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. సావిత్రి జీవితంపై బయోపిక్ తెరకెక్కించడం ద్వారా దత్ -అశ్విన్ బృందం సావిత్రికి గొప్ప నివాళిగా అరుదైన కానుకను ఇచ్చారనే చెప్పాలి. నేడు కొమ్మారెడ్డి సావిత్రి(ఇంటి పేరు సహా) జయంతి సందర్భంగా ఈ స్పెషల్.
గొప్ప కథానాయికలకే సాధ్యం కానిది. కానీ ఆ యువనటి ఆరంగేట్రమే అలాంటి సాహసానికి పూనుకుంది. ఒంటి కన్ను నుంచి కన్నీళ్లు పెట్టుకుని దర్శకదిగ్గజాలచే శహభాష్ అనిపించుకుంది. అలాంటి అరుదైన నట ప్రతిభ తన సొంతం కాబట్టే సావిత్రి మహానటి అయ్యారు. క్లాసిక్ డేస్ సంచలనంగా దశాబ్ధాల పాటు ఇండస్ట్రీని ఏలారు. ఇక సావిత్రి మల్టీట్యాలెంట్ గురించి చెప్పాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది.
దిగ్గజ నటి సావిత్రి గురించి ప్రస్తావించకుండా ఎన్.టి.రామారావు అక్కినేని నాగేశ్వర రావు లేదా శివాజీ గణేషన్ గురించి మాట్లాడలేం. ఆమె గుంటూరు జిల్లాలో జన్మించారు. బాల నటిగా రంగస్థలంపై ప్రవేశించి.. జీవితంలో కేవలం సినిమా కంటే చాలా ఎక్కువ ఉంది అని నిరూపించారు. నటిగా గాయనిగా నిర్మాతగా రేస్ కార్ డ్రైవర్ గా ఆల్ రౌండర్ ప్రతిభను చాటుకున్నారు. తన స్వల్ప జీవిత కాలంలోనే తెలుగు -తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నట ప్రతిభతోనే కాదు.. ప్రజలకు సహాయపడే సేవాగుణం మంచితనంతో గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్నారు.
సహజనటిగా మహానటిగా తన కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు సావిత్రి. దేవదాస్- మిస్సమ్మ- కలతూర్ కన్నమ్మ- పసల్మార్- కార్పగం- తిరువిలయదల్ చిత్రాలలో నటనకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.
సావిత్రి జీవితంపై ఏకంగా బయోపిక్ ని నిర్మించారు వైజయంతి అధినేత అశ్వనిదత్. సావిత్రి రకరకాల కారణాలతో అగ్ర కథానాయకుడు శివాజీ గణేషన్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె - కుమారుడు ఉన్నారు.
సావిత్రి అంతిమ జీవితం ఎంతో సహనంతో కూడుకున్నది. ఆమె దానధర్మాలు ఔదార్యం కారణంగా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ఎంత కష్టం వచ్చినా కానీ ఎప్పుడూ ఇతరుల సహాయం తీసుకోలేదు. ఆమెను దగ్గరగా ఉన్నవారే మోసం చేశారు. సహాయం చేయదలిచినా ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. కెరీర్ చివరిలో సహాయ నటిగానూ నటించిన ఏకైక మేటి నాయిక సావిత్రి. నిర్మాతగా ఎన్నో సాహసాలు చేశారు. అందుకే తనను అమ్మ అని పిలిచి గౌరవించారు కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు. పరిశ్రమ దిగ్గజాలంతా ఆమెను అమ్మ అనే గౌరవిస్తారు.
అంత గొప్ప స్టార్ ఐదు పదుల కన్నా తక్కువ సంవత్సరాలు జీవించారు. కానీ ఆమె వైభవం కీర్తి ఈ రోజు వరకు చెక్కు చెదరలేదు. రాబోయే తరాల వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. సావిత్రి జీవితంపై బయోపిక్ తెరకెక్కించడం ద్వారా దత్ -అశ్విన్ బృందం సావిత్రికి గొప్ప నివాళిగా అరుదైన కానుకను ఇచ్చారనే చెప్పాలి. నేడు కొమ్మారెడ్డి సావిత్రి(ఇంటి పేరు సహా) జయంతి సందర్భంగా ఈ స్పెషల్.