నేచురల్ స్టార్ కాదు.. మెగా ప్రిన్స్

Update: 2016-02-10 11:30 GMT
‘స్నేహగీతం’ సినిమాలో నటించిన హీరోల్లో ఒకడైన వెంకీ అట్లూరి గుర్తున్నాడా? దాని కంటే ముందు ‘జ్నాపకం’ అనే మరో సినిమా కూడా చేశాడతను. నటన అచ్చిరాకపోవడంతో అతను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరిపోయిన ఈ కుర్రాడు.. త్వరలోనే దర్శకత్వ అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత సంస్థలో దర్శకుడిగా పరిచయమయ్యే అవకాశం దక్కింది వెంకీకి. ఇప్పటికే నానికి కథ చెప్పి ఓకే చేయించుకున్న వెంకీ.. స్క్రిప్టు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఐతే నాని ఖాళీ అవడానికి చాలా టైం పట్టే అవకాశముండటంతో అతడి బదులు వేరే హీరోను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఆ హీరో మరెవరో కాదు.. వరుణ్ తేజ్. అతడికి కథ చెప్పడం.. ఓకే చేయడం అంతా జరిగిపోయాయి. నానికి కూడా సర్దిచెప్పేశారు. ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. వరుణ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో‘రాయబారి’ సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత వెంకీ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి హిట్లు కొట్టడంలో దిల్ రాజుకు మంచి పేరుంది. ఐతే ఈ మధ్య ఆయన స్పీడు కొంచెం తగ్గింది. వరుణ్ తేజ్ తో దిల్ రాజు చేయబోయే తొలి సినిమా ఇదే కావడం విశేషం.
Tags:    

Similar News